AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Cabinet Decisions: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. మోదీ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో చాలా రాష్ట్రాల లెక్క మారిపోతుంది.

Modi Cabinet Decisions: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.. మోదీ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం..
Pm Narendra Modi
Sanjay Kasula
|

Updated on: Sep 19, 2023 | 2:58 PM

Share

మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తొలిరోజు సమావేశం పార్లమెంట్‌ పాత భవనంలో జరిగింది. మరుసటి రోజు అంటే రేపటి నుంచి కొత్త సభలో పార్లమెంట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగా, సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ మంత్రివర్గం సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే జరిగితే దశాబ్దాలుగా ఈ బిల్లు చర్చకు నోచుకోని రోజు చరిత్ర పుటల్లో నమోదవుతుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం..

నిజానికి ఊహించినదే జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో చాలా రాష్ట్రాల లెక్క మారిపోతుంది.

అనేక ఆశ్చర్యకరమైన దశలు:

మనం పార్లమెంటు గురించి మాట్లాడినట్లయితే.. ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. ఇది మొత్తం 543 మందిలో 15 శాతం కంటే తక్కువ. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం పార్లమెంటులో పంచుకున్న గణాంకాల ప్రకారం, రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం కూడా దాదాపు 14 శాతం. ఐదు రోజుల పార్లమెంటు సమావేశాల్లో అనేక ఆశ్చర్యకరమైన చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పబడింది.

చిత్రం క్లియర్‌గా కనిపిస్తోంది..

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంబంధించిన సీన్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే అంగీకరించాయి. గతంలో ఈ బిల్లును తీసుకురావాలని బీజేడీ, బీఆర్‌ఎస్‌తో పాటు పలు పార్టీలు డిమాండ్ చేయగా.. హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కాంగ్రెస్‌ కూడా తీర్మానం చేసింది. 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రోజులు వచ్చాయని తెలుస్తోంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే..

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే.. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వచ్చిన ఎంపీలు ఢిల్లీ (ఎన్‌సీఆర్) చుట్టుపక్కల వారే. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి మహిళలను తీసుకొచ్చే బాధ్యత ఎంపీలకు అప్పగించినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం