AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంధువులను కలుసుకునేందుకు వెళ్లి 18 ఏళ్ల పాటు పాక్‌ జైల్లో గడిపి.. భారత్‌కు వచ్చిన హసీనాబేగం కన్నుమూత

భర్త తరపున తన బంధువులను కలుసుకునేందుకు వెళ్లి పాక్ లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష  అనుభవించిన తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు..

బంధువులను కలుసుకునేందుకు వెళ్లి 18 ఏళ్ల పాటు పాక్‌ జైల్లో గడిపి.. భారత్‌కు వచ్చిన హసీనాబేగం కన్నుమూత
Subhash Goud
|

Updated on: Feb 11, 2021 | 7:30 AM

Share

భర్త తరపున తన బంధువులను కలుసుకునేందుకు వెళ్లి పాక్ లో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష  అనుభవించిన తర్వాత భారత్‌లో అడుగు పెట్టిన భారతీయ మహిళ హసీనాబేగం (65) కన్నుమూశారు. పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఔరంగాబాద్‌ పోలీసుల సహకారంతో 2021, జనవరి 26న మంగళవారం స్వస్థలానికి చేరుకుంది. అయితే ఈనెల 9న గుండెపోటుతో ఆమె మరణించారు. మంగళవారం ఉదయం ఛాతినొప్పులతో బాధపడుతుండటంతో బంధువులు వైద్యుడిని పిలిపించి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె అప్పటికే కన్నుమూసింది.

కొన్నేళ్ల కిందట ఆమె తన బంధువులను కలుసుకునేందుకు పాకిస్థాన్‌కు వెళ్లింది. పాస్‌ పోర్టును పోగొట్టుకోవడంతో ఇబ్బందుల్లో పడిపోయింది. ఆమె భారతీయురాలని నిరూపించే తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఆమె పాక్‌ జైల్లో ఉండిపోయింది. ఆమె అదృశ్యం అయినట్లు బంధువులు గౌరంగాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. చివరకు ఆమె లాహోర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిసింది. ఆమె భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఔరంగాబాద్‌ పోలీసులు సహకరించారు.

అయితే 2000లో తన ఇంటిని ఎవరో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తెలుసుకున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇల్లు తన పేరే ఉందని నిరూపించే పేపర్లను సమర్పించారు. దీని ఆధారంగా పోలీసులు ఆమె భారతీయురాలని రుజువు చేసి పాక్ జైలు నుంచి విడిపించారు. ఔరంగాబాద్‌కు చెందిన హసీనా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

Also Read: Voter Id Card Corrections: మీ ఓటర్ కార్డులో పేరు, అడ్రస్ తప్పుగా ఉన్నాయా ? అయితే సులభంగా మార్చేసుకోండిలా..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే