Black Magic: వెస్ట్ బెంగాల్‌లో అవమానవీయ ఘటన.. మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై దాడి.. మూత్రం తాగించిన గ్రామస్థులు

మంత్రాలు తంత్రాలపై నమ్మకంతో సాటి మనిషిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మానవత్వం మరచి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. తాజాగా మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఓ గ్రామస్థులు ఓ కుటుంబాన్ని దారుణంగా కొట్టారు.

Black Magic: వెస్ట్ బెంగాల్‌లో అవమానవీయ ఘటన.. మంత్రాల నెపంతో ఓ కుటుంబంపై దాడి.. మూత్రం తాగించిన గ్రామస్థులు
Raghunathganj

Updated on: May 27, 2022 | 3:58 PM

Black Magic: మనిషి ఆధునికంగా సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. నేటికీ సమాజంలో మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు విశ్వంలో అడుగు పెడుతున్న మనిషి.. మరోవైపు మంత్రాలు తంత్రాలపై నమ్మకంతో సాటి మనిషిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మానవత్వం మరచి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. తాజాగా మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఓ గ్రామస్థులు ఓ కుటుంబాన్ని దారుణంగా కొట్టారు. అంతేకాదు వారితో మూత్రాన్ని కూడా తాగించారు. ఈ అవమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్ లో(West Bengal) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ముర్షీదాబాద్​ జిల్లాలో రఘునాథ్​గంజ్​ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. మథురాపుర్​లో ఓ కుటుంబం తమ గ్రామంలోని వారికి చేతబడి చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు ఆ కుటుంబంపై దాడి చేశారు.  వారిని చితక కొట్టి.. అనంతరం ఆ కుటుంబంతో మూత్రం తాగించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఓ కుటుంబాన్ని కొందరు గ్రామస్థులు బంధించి.. కర్రతో దారుణంగా కొట్టినట్లు కనిపిస్తోంది. అనంతరం గ్రామస్థులు వారితో మూత్రం తాగించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారి.. పోలీసుల ద్రుష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us