Black Magic: మనిషి ఆధునికంగా సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. నేటికీ సమాజంలో మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు విశ్వంలో అడుగు పెడుతున్న మనిషి.. మరోవైపు మంత్రాలు తంత్రాలపై నమ్మకంతో సాటి మనిషిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మానవత్వం మరచి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. తాజాగా మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఓ గ్రామస్థులు ఓ కుటుంబాన్ని దారుణంగా కొట్టారు. అంతేకాదు వారితో మూత్రాన్ని కూడా తాగించారు. ఈ అవమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్ లో(West Bengal) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ముర్షీదాబాద్ జిల్లాలో రఘునాథ్గంజ్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. మథురాపుర్లో ఓ కుటుంబం తమ గ్రామంలోని వారికి చేతబడి చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు ఆ కుటుంబంపై దాడి చేశారు. వారిని చితక కొట్టి.. అనంతరం ఆ కుటుంబంతో మూత్రం తాగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఓ కుటుంబాన్ని కొందరు గ్రామస్థులు బంధించి.. కర్రతో దారుణంగా కొట్టినట్లు కనిపిస్తోంది. అనంతరం గ్రామస్థులు వారితో మూత్రం తాగించినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ గా మారి.. పోలీసుల ద్రుష్టికి చేరుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..