జ్యోతిరాదిత్య తిరుగుబాటు.. నో వర్రీ ! కమల్ నాథ్

కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటును, ఆయనకు మద్దతుదారులైన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాను మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తేలిగ్గా తీసుకున్నారు.

జ్యోతిరాదిత్య  తిరుగుబాటు.. నో వర్రీ ! కమల్ నాథ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2020 | 11:11 AM

కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటును, ఆయనకు మద్దతుదారులైన 21 మంది ఎమ్మెల్యేల రాజీనామాను మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తేలిగ్గా తీసుకున్నారు. ఈ పరిణామం పట్ల తామేమీ ఆందోళన చెందడంలేదని, శాసన సభలో మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం పూర్తి కాలం పదవిలో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జ్యోతిరాదిత్య మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, పార్టీ ఆయనను బహిష్కరించడం తెలిసిందే. ఇక ఆయనను బీజేపీ తన ‘అక్కున చేర్చుకుంటుందని’,  రాజ్యసభ సీటును, కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడానికి సిధ్ధంగా ఉందని కూడా వార్తలు వచ్చాయి. జ్యోతిరాదిత్య ‘పరిణామాల’ కారణంగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కాగా-కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. కమల్ నాథ్ ప్రభుత్వానికి వఛ్చిన ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఆయన రాజీనామా చేయబోరని, అసెంబ్లీలో తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకుంటారని అన్నారు. కమల్ నాథ్ గట్టెక్కుతారా అని ప్రశ్నించగా.. అందుకు అవకాశం ఉందన్నారు. నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందన్నారు. పైగా రెబెల్ ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగి తమతో చేరవచ్చునని, వారి కుటుంబాలు తమతో టచ్ లో ఉన్నారని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. వారు తమ  శాసన సభ్యత్వాలను వదులుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు.

జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయకుండా చూసేందుకు తమ పార్టీ ఎంతో కృషి చేసిందని, ఆయనకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వజూపితే నిరాకరించారని దిగ్విజయ్ తెలిపారు. అలాగే  డిప్యూటీ సీఎం పదవిని కూడా అంగీకరించలేదని,  , పైగా ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తే ఎవరు వ్యతిరేకిస్తారని దిగ్విజయ్ పేర్కొన్నారు. పార్టీలో ఇన్నిఅనుకూలతలు ఉన్నా జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ వైపు మొగ్గడం చూస్తే.. కాషాయ పార్టీ ఆయనను ఎంతగా ప్రలోభ పెట్టిందో తెలుస్తోందని దిగ్విజయ్  వ్యాఖ్యానించారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్