ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగివున్న రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..

అయితే, ఆగివున్న రైల్లో మంటలు ఎలా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది. రైలులో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో వ్యాపించిన పొగలు మెజెస్టిక్ బస్టాండ్‌లోకి స్పష్టంగా కనిపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు రైల్వే అధికారులు తెలిపారు.

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగివున్న రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
Udayan Express
Follow us

|

Updated on: Aug 19, 2023 | 1:50 PM

మరో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – KSR బెంగళూరు ఉద్యాన్ డైలీ ఎక్స్‌ప్రెస్ (రైలు)లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజన్ నుండి పొగలు రావడాన్ని స్టేషన్ అధికారులు గమనించి, అలారం మోగించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సౌత్ వెస్టర్న్ రైల్వే పీఆర్ఓ అనీశ్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఈ శనివారం ఉదయం 5.45 గంటలకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 3పైకి చేరుకుంది ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఆగి ఉన్న ఈ రైలులోని B1, B2 బోగీలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఉదయం సుమారు 7.10 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 7.35 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

ఇవి కూడా చదవండి

అయితే, ఆగివున్న రైల్లో మంటలు ఎలా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది. రైలులో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో వ్యాపించిన పొగలు మెజెస్టిక్ బస్టాండ్‌లోకి స్పష్టంగా కనిపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి
వర్షంలో తడిసిన బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా? ఈ చిట్కాలు పాటించండి
ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? చాలా ఫెమస్ ఆమె
ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టారా..? చాలా ఫెమస్ ఆమె
ఈ ప్రాంతాల్లో ర‌క్త‌పు వ‌ర్షం కురుస్తుంది.. కార‌ణం ఏంటంటే..
ఈ ప్రాంతాల్లో ర‌క్త‌పు వ‌ర్షం కురుస్తుంది.. కార‌ణం ఏంటంటే..
ఆన్‌లైన్లో ఫ్యాన్సీ నంబర్.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఇప్పుడే..
ఆన్‌లైన్లో ఫ్యాన్సీ నంబర్.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. ఇప్పుడే..
ఎట్టకేలకు BBA, BCA కోర్సులకు ఫీజులు ఖారారు.. అయినా తొలగని అయోమయం
ఎట్టకేలకు BBA, BCA కోర్సులకు ఫీజులు ఖారారు.. అయినా తొలగని అయోమయం
మెయిన్ స్విచ్ నుండి నేరుగా ఏసీ ఆఫ్ చేస్తే నష్టం ఏంటి?
మెయిన్ స్విచ్ నుండి నేరుగా ఏసీ ఆఫ్ చేస్తే నష్టం ఏంటి?
వీధుల్లో విహరిస్తున్న సోయగం.. కాంతార బ్యూటీ క్యూట్ ఫొటోస్..
వీధుల్లో విహరిస్తున్న సోయగం.. కాంతార బ్యూటీ క్యూట్ ఫొటోస్..
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రాయల్ రన్ సక్సెస్
పెసలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
పెసలు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!
శనిపై శుక్రుడి దృష్టి.. ఆ రాశుల వారికి ధన, రాజయోగాలు పక్కా..!