AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగివున్న రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..

అయితే, ఆగివున్న రైల్లో మంటలు ఎలా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది. రైలులో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో వ్యాపించిన పొగలు మెజెస్టిక్ బస్టాండ్‌లోకి స్పష్టంగా కనిపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు రైల్వే అధికారులు తెలిపారు.

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగివున్న రైలులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..
Udayan Express
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2023 | 1:50 PM

Share

మరో రైలు ప్రమాదం ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – KSR బెంగళూరు ఉద్యాన్ డైలీ ఎక్స్‌ప్రెస్ (రైలు)లో మంటలు చెలరేగాయి. రైలు ఇంజన్ నుండి పొగలు రావడాన్ని స్టేషన్ అధికారులు గమనించి, అలారం మోగించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సౌత్ వెస్టర్న్ రైల్వే పీఆర్ఓ అనీశ్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ఈ శనివారం ఉదయం 5.45 గంటలకు ప్లాట్‌ఫారమ్ నంబర్ 3పైకి చేరుకుంది ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఆగి ఉన్న ఈ రైలులోని B1, B2 బోగీలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఉదయం సుమారు 7.10 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 7.35 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

ఇవి కూడా చదవండి

అయితే, ఆగివున్న రైల్లో మంటలు ఎలా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది. రైలులో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో వ్యాపించిన పొగలు మెజెస్టిక్ బస్టాండ్‌లోకి స్పష్టంగా కనిపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..