Viral Video: ఓట్ల కోసం నేతల ఫీట్లు.. స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌లో పూరీలు చేస్తున్న కాంగ్రెస్ నేత..

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర పట్వారీ అకా జితు పట్వారీ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండోర్‌లో దసరా వేడుకల సందర్భంగా రోడ్‌సైడ్ స్టాల్‌లో పూరీలు వేయిస్తున్న జితేంద్ర కనిపిస్తున్నాడు. అక్టోబర్ 25న X లో వీడియో షేర్ చేసిన జితు పట్వారీ ఆ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు.

Viral Video: ఓట్ల కోసం నేతల ఫీట్లు.. స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌లో పూరీలు చేస్తున్న కాంగ్రెస్ నేత..
Jitu Patwari
Follow us

|

Updated on: Oct 26, 2023 | 2:43 PM

ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తికి తగిన ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొందరు పిల్లలకు స్నానము చేయిస్తే.. మరికొందరు ముగ్గులు చేసిన సందర్భాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ కు చెందిన ఓ రాజకీయ నేత రోడ్ సైడ్ ఉన్న ఓ ఫుడ్ స్టాల్ లో వంట చేసే వ్యక్తిగా మారాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర పట్వారీ అకా జితు పట్వారీ ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండోర్‌లో దసరా వేడుకల సందర్భంగా రోడ్‌సైడ్ స్టాల్‌లో పూరీలు వేయిస్తున్న జితేంద్ర కనిపిస్తున్నాడు. అక్టోబర్ 25న X లో వీడియో షేర్ చేసిన జితు పట్వారీ ఆ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి వీడ్కోలు చెప్పడానికి రెడీ అయ్యారు. ఆ విషయం ఇప్పటికే BJP వీడ్కోలు నిర్ణయించబడిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్ కూడా  అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 13న నిర్వహించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..