AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతా బుల్డోజర్ బాబా మహత్యం.. రెండు వారాల్లో 50 మందికి పైగా నేరస్థులు లొంగిబాటు.. క్యూలో మరికొందరు!

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే బుల్‌డోజర్‌లకు భయపడి 50 మందికి పైగా నేరస్థులు పోలీసులకు లొంగిపోయారు

అంతా బుల్డోజర్ బాబా మహత్యం.. రెండు వారాల్లో 50 మందికి పైగా నేరస్థులు లొంగిబాటు.. క్యూలో మరికొందరు!
Yogi
Balaraju Goud
|

Updated on: Mar 28, 2022 | 10:14 PM

Share

Criminals Surrendered in UP: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లోనే బుల్‌డోజర్‌లకు భయపడి 50 మందికి పైగా నేరస్థులు పోలీసులకు లొంగిపోయారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం కఠినమైన వైఖరికి పర్యాయపదంగా ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘బుల్‌డోజర్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగించారు. అదే సమయంలో బీజేపీ(BJP) మెజారిటీతో గెలుపొందడంతో యోగి మద్దతుదారులు ఆయనకు ‘బుల్‌డోజర్ బాబా’ అనే కొత్త పేరు పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వీడియోలు,చిత్రాలలో ‘పరారీలో ఉన్న చాలా మంది నేరస్థులు మెడలో ప్లకార్డులు వేలాడదీసుకుని లొంగిపోయారని’ చూడవచ్చని అధికారులు తెలిపారు. ‘నేను లొంగిపోతున్నాను దయచేసి కాల్చవద్దు’, అంటూ వేడుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. దీని బట్టి నేరస్థులల్లో భయాన్ని చూపుతుంది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గత పక్షం రోజుల్లో 50 మందికి పైగా నేరస్థులు లొంగిపోవడమే కాకుండా నేరాలకు దూరంగా ఉన్నారని కూడా ప్రతిజ్ఞ చేశారని ఆయన తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నేరస్థులు చనిపోయారని, ఇంకా చాలా మందిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం మేరకు బుల్డోజర్ల సాయంతో ఆక్రమణల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ధ్వంసం చేయడానికి నేరస్థులు ఉపయోగించే భారీ యంత్రాన్ని ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్రంలో నేరాలను “జీరో టాలరెన్స్” విధానంలో భాగంగా ఉపయోగించింది. ఆదిత్యనాథ్ తన ఎన్నికల ప్రసంగాలలో, ‘బుల్డోజర్‌లు మరమ్మతులు, నిర్వహణ కోసం వెళ్లాయని, మార్చి 10 ఫలితాల ప్రకటన తర్వాత మళ్లీ పని చేస్తానని’ చెప్పారు. దీంతో యూపీ నేరస్థుల్లో భయం పట్టుకుంది.

అనేక కిడ్నాప్, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న హార్డ్ కోర్ క్రిమినల్ గౌతమ్ సింగ్ మార్చి 15న గోండా జిల్లాలోని చాప్లా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఏడీజీ కుమార్ తెలిపారు. భయంతో, సహరాన్‌పూర్‌లోని ఒక పోలీసు స్టేషన్‌లో, దాదాపు రెండు డజన్ల మంది నేరస్థులు లొంగిపోవడానికి వరుసలో ఉన్నారు. ఎప్పుడూ నేరం చేయనని హామీ ఇచ్చారు. అదే సమయంలో, దేవ్‌బంద్‌లో నలుగురు మద్యం స్మగ్లర్లు లొంగిపోయినట్లు నివేదికలు ఉన్నాయి. షామ్లీలో చాలా మంది నేరస్థుల విషయంలో కూడా ఇది జరిగింది.

ఇదిలావుంటే, గత వారం ప్రతాప్‌గఢ్ నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితులలో ఒకరు తన ఇంటి వెలుపల బుల్డోజర్‌ను పోలీసులు పార్క్ చేసిన తర్వాత లొంగిపోయారు. నిందితులు నాలుగు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోని టాయిలెట్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు, ఔరయ్య జిల్లాలోని మార్కెట్‌లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను జిల్లా యంత్రాంగం సోమవారం తొలగించింది. కొద్ది రోజుల క్రితం, హోలీ సందర్భంగా , మెయిన్‌పురిలో బలవంతంగా ఆక్రమించిన భూమిలో ఉన్న దుకాణాలను అధికార యంత్రాంగం తొలగించింది. నేరస్తులు, మాఫియా పట్ల ఉదాసీనత చూపవద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని ఏడీజీ తెలిపారు. Pakistan Political Crisis: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసం.. తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ Read Also…

Follow Us
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!