AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Political Crisis: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసం.. తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పీక్ స్టేజీకి చేరుకుంది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షం సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై మార్చి 31న చర్చ జరగనుంది.

Pakistan Political Crisis: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసం.. తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్
Imran Khan
Balaraju Goud
|

Updated on: Mar 28, 2022 | 9:38 PM

Share

Pakistan political crisis: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పీక్ స్టేజీకి చేరుకుంది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ(National Assembly)లో ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)పై ప్రతిపక్షం సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై మార్చి 31న చర్చ జరగనుంది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంట్‌ కార్యకలాపాలు మార్చి 31 సాయంత్రం 4 గంటలకు వాయిదా పడ్డాయి. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై మార్చి 31న చర్చ జరగనుంది. అదే విధంగా అవిశ్వాసంపై ఏప్రిల్ 3 లేదా 4 న ఓటింగ్ నిర్వహించవచ్చని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే ప్రతిపక్షాలకు కనీసం 172 మంది ఎంపీల ఓట్లు అవసరం. విపక్షాలకు చెందిన 161 మంది ఎంపీలు ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు.

మార్చి 8న జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్‌లో ప్రతిపక్ష పార్టీలు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటి నుంచి దేశంలో రాజకీయ అస్థిరత వాతావరణం నెలకొంది. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరగడానికి ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇమ్రాన్ ఖాన్ (64) ఈ రోజుల్లో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలో విదేశీ శక్తుల హస్తం ఉందని అన్నారు. తమ పార్టీ వాళ్లను వాడుకుంటున్నారని అన్నారు. డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. మాపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. లిఖితపూర్వకంగా మమ్మల్ని బెదిరించారు కానీ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. దీని వెనుకు ఉన్న విదేశీ కుట్రతో సహా చాలా విషయాలు త్వరలో బయటపెడతామని ఆయన హెచ్చరించారు.

వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న ధనవంతులను పట్టుకోవడంలో చట్టం విఫలమైనందున పేద దేశాలు వెనుకబడి ఉన్నాయని ప్రధాని ఖాన్‌ను ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక పేర్కొంది. వారు దోచుకున్న డబ్బును విదేశీ బ్యాంకులకు పంపుతారు. కొందరు దొంగలు పెద్ద దొంగల లాగా దేశాన్ని నాశనం చేయరని పేర్కొంది. మాజీ ప్రధాని, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) అధినేత నవాజ్ షరీఫ్, పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ అధినేత, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, జమియత్ ఉలేమా ఇ ఇస్లాం నాయకుడు ఫజ్లూర్ రెహ్మాన్‌లను ప్రస్తావిస్తూ, “ఎవరు వచ్చినా ఎందుకు రావాలి? నా ప్రభుత్వం లేదా నా జీవితం పోతుంది, నేను వారిని క్షమించను. అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

Read Also…  West Bengal: రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ.. నిండు సభలో తన్నుకున్న ఎమ్మెల్యేలు