AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలుగులోకి ‘బయోలాజికల్ జిహాద్’! యూపీలో డాక్టర్‌ని, అతని కుటుంబాన్ని చంపే ప్రయత్నం!

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హేయమైన దారుణం వెలుగులోకి వచ్చింది. బాగ్‌పత్‌లో బయోలాజికల్ జిహాద్‌కు సంబంధించిన షాకింగ్ కేసు బయటపడింది.

వెలుగులోకి 'బయోలాజికల్ జిహాద్'! యూపీలో డాక్టర్‌ని, అతని కుటుంబాన్ని చంపే ప్రయత్నం!
File Image
Balaraju Goud
|

Updated on: Oct 08, 2024 | 7:43 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత హేయమైన దారుణం వెలుగులోకి వచ్చింది. బాగ్‌పత్‌లో బయోలాజికల్ జిహాద్‌కు సంబంధించిన షాకింగ్ కేసు బయటపడింది. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ యశ్వీర్ సింగ్‌ను కఫం బాక్టీరియా ఇచ్చి చంపడానికి కుట్ర పన్నారని తెలుస్తోంది. తన డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అయిన ల్యాబ్ టెక్నీషియన్లు డాక్టర్ కుటుంబానికి టిబి వ్యాధికి కారణమయ్యే కఫం బాక్టీరియాను ఇచ్చి చంపడానికి ప్రయత్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో కుట్ర బట్టబయలైంది.

ల్యాబ్‌లోని బ్యాక్టీరియాను ఇచ్చి డిప్యూటీ సీఎంఓను, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఆడియో వింటుంటే స్పష్టమవుతోంది. కుట్ర బట్టబయలైన తర్వాత, డిప్యూటీ సీఎంఓ బాగ్‌పత్ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

డిప్యూటీ సీఎంఓ యశ్వీర్ సింగ్ జిల్లా క్షయవ్యాధి అధికారిగా ఉన్నారు. అతని వద్ద ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు ముషీర్ అహ్మద్, జబ్బర్ ఖాన్ ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నెర్వహిస్తున్నారు. TB, HIV పరీక్షల కోసం పనిచేస్తున్నారు. టీబీ శ్లేష్మం ప్రాణాంతక బ్యాక్టీరియాను డిప్యూటీ సీఎంఓ, అతని కుటుంబ సభ్యులకు అందించడం గురించి ఇద్దరు సిబ్బంది మాట్లాడుతున్న ఆడియో క్లిప్ డిప్యూటీ సీఎంఓకు వచ్చింది. ఆడియో వైరల్ కావడంతో డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు.

ఉమ్మి జిహాద్ తర్వాత, బాగ్‌పత్ ప్రజలు ముస్లిం యువకులు టిబి బ్యాక్టీరియాను ఇవ్వడాన్ని బయోలాజికల్ జిహాద్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంఓ ఆరోపణలపై బాగ్‌పత్ సిటీ కొత్వాలి పోలీసులు, ఆరోగ్య శాఖ దర్యాప్తు ప్రారంభించింది. విచారణ తర్వాతే అసలు విషయం, కుట్ర వెనుక కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, కొద్ది రోజుల క్రితం ఇక్కడ నుంచి స్పిట్ జిహాద్ ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వీడియో వైరల్ అయ్యింది, అందులో షెహజాద్ అనే వ్యక్తి ఉమ్మివేస్తూ రోటీని తయారు చేయడం కనిపించింది. స్పిట్ జిహాద్‌లో నిందితుడైన షాజాద్‌ను బాగ్‌పత్ పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. నరేష్ బాగ్‌పత్‌లోని తత్తిరి పట్టణంలోని చికెన్ కార్నర్‌లో పనిచేసేవాడు. ఈ ఘటన మరువకముందే మరో దారుణం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..