AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.

ముఖ్యమంత్రి ఎవరూ? బెంగాల్, అస్సాంలలో ముమ్మరమైన కసరత్తు.. రంగంలోకి దిగిన అగ్రనేతలు అమిత్ షా, నడ్డా
Amit Shah, Jp Nadda
Balaraju Goud
|

Updated on: May 05, 2026 | 5:53 PM

Share

పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అపూర్వ విజయం, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానుల వరకు రాజకీయ సందడి నెలకొంది.

పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్న బీజేపీ, అక్కడ ప్రభుత్వాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించాలని భావిస్తోంది. ఈ కీలక బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా భుజానకెత్తుకున్నారు. బెంగాల్ రాజకీయ సరళిని, క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, మంత్రివర్గ కూర్పును ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యూహాత్మక అడుగు ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.

అటు అస్సాంలో వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికం చేసింది. శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్రం ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దింపింది. అస్సాం కేంద్ర పరిశీలకుడుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ ను నియమించయింది. సహ-పరిశీలకుడుగా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని నడ్డాకు సహకరిస్తూ, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ ఇద్దరు నేతలు గౌహతిలో జరగనున్న శాసనసభ పక్ష సమావేశంలో పాల్గొని, ఏకాభిప్రాయంతో నాయకుడిని ఎంపిక చేసి, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తారు.

ఎన్నికల విజయానంతరం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కేవలం పార్టీది మాత్రమే కాదని, ప్రధాని మోదీపై ప్రజలకున్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. “అస్సాంలో అభివృద్ధి గంగానది నిరంతరం ప్రవహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ వేగంతో పనిచేస్తాయి” అని ఆయన ఆకాంక్షించారు.

మొత్తానికి, ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలు ఈశాన్య, తూర్పు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా వ్యూహాలు, అస్సాంలో జేపీ నడ్డా పర్యవేక్షణ కలిసి సుస్థిరమైన, అభివృద్ధి పథంలో నడిచే ప్రభుత్వాలను అందిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలకు ముహూర్తం ఖరారు కావడంతో, ఇరు రాష్ట్రాల ప్రజలు నూతన పాలన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us