కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారుకు ప్రమాదం.. భార్య మృతి.. ఇప్పటివరకు అందిన వివరాలు ఇవి

|

Jan 11, 2021 | 10:05 PM

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక అంకోలా జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.  ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ మరణించారు.

కేంద్ర మంత్రి  శ్రీపాద్ నాయక్ కారుకు ప్రమాదం.. భార్య మృతి.. ఇప్పటివరకు అందిన వివరాలు ఇవి
Follow us on

కేంద్ర ఆయుష్ మంత్రి  శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక అంకోలా జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.  ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ మరణించారు. మంత్రి శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు.  మొత్తం నలుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాయక్ పర్సనల్ సెక్రటరీ దీపక్ రామ్‌దాదా గోమ్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీపాద్ నాయక్ కేంద్ర ఆయుర్వేద, యోగా & ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ,  హోమియోపతి మంత్రిత్వ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 

 

Also Read :

Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు

AP Local Body Polls: ఏపీ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నట్లు వెల్లడి

Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..