టిక్ టాక్ పిచ్చితో.. నదిలో దూకేశారు..

| Edited By:

Jul 03, 2019 | 2:02 PM

టిక్ టాక్ పిచ్చిలో పడిన జనం తాము ఏ చేస్తున్నామో తెలియకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఘోరక్‌పూర్‌లో టిక్ టాక్ చేస్తూ ఇద్దరు యువకులు నదిలో దూకారు. దియనార్ జిల్లాలో మజ్నా నాలా చోటిగండక్ నది వద్దకు సాయంత్రం యువకులంతా సరదాగా కలిసి వెళ్లారు. నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ పై అందరూ చిట్ చాట్ చేస్తూ రకరకాల స్టంట్స్ చేస్తూ వాటిని మొబైల్ ఫోన్‌లో షూట్ చేస్తున్నారు. ఇంతలో దినార్ అనే యువకుడు నదిలోకి […]

టిక్ టాక్ పిచ్చితో.. నదిలో దూకేశారు..
Follow us on

టిక్ టాక్ పిచ్చిలో పడిన జనం తాము ఏ చేస్తున్నామో తెలియకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఘోరక్‌పూర్‌లో టిక్ టాక్ చేస్తూ ఇద్దరు యువకులు నదిలో దూకారు. దియనార్ జిల్లాలో మజ్నా నాలా చోటిగండక్ నది వద్దకు సాయంత్రం యువకులంతా సరదాగా కలిసి వెళ్లారు. నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ పై అందరూ చిట్ చాట్ చేస్తూ రకరకాల స్టంట్స్ చేస్తూ వాటిని మొబైల్ ఫోన్‌లో షూట్ చేస్తున్నారు. ఇంతలో దినార్ అనే యువకుడు నదిలోకి దూకాడు దాన్ని ఆషిక్ అనే మరో యువకుడు తన మొబైల్ ఫోన్‌లో షూట్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. కాసేపటికి అతను కూడా నదిలోకి దూకే స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. వీరిని చూసిన స్థానికులు నదిలోకి దూకి దినార్‌ను కాపాడారు. ఆషిక్ అనే మరో యువకుడు మాత్రం గల్లంతయ్యాడు. దీంతో అతనికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.