AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM MK Stalin: మానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం.. కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి.. స్టాలిన్‌పై ప్రశంసలజల్లు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. చెన్నైలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా అంబులెన్స్‌కు దారి ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు స్టాలిన్‌.

CM MK Stalin: మానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం.. కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి.. స్టాలిన్‌పై ప్రశంసలజల్లు
Tamilnadu Cm Mk Stalin
Balaraju Goud
|

Updated on: Nov 01, 2021 | 1:20 PM

Share

Tamil Nadu CM MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. చెన్నైలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా అంబులెన్స్‌కు దారి ఇచ్చి గొప్పతనాన్ని చాటుకున్నారు స్టాలిన్‌. కోయంబ‌త్తూరు – వెల‌చెరి రూట్లో సీఎం కాన్వాయ్ వెళ్తోంది. అదే స‌మ‌యంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వేగంగా దూసుకువచ్చింది. ఇది గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన సీఎం వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం ముఖ్యమంత్రి వాహ‌న‌శ్రేణి దారిని ఇచ్చింది. ఎడ‌మ వైపు కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు మార్గాన్ని క‌ల్పించారు. మార్గమ‌ధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై తమిళ జనం ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను అనేక మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

ఇదిలావుంటే, సీఎం స్టాలిన్ ఇటీవ‌ల కాన్వాయ్‌లోని వాహ‌నాల సంఖ్యను త‌గ్గించాల‌ని ఆదేశించారు. ఎవ‌రూ కాన్వాయ్ వ‌ల్ల ట్రాఫిక్ స‌మ‌స్యలు ఎదుర్కోవ‌ద్దు అన్నారు. స్టాలిన్ వాహ‌న‌శ్రేణిలో రెండు పైలెట్ వాహ‌నాలు, మూడు ఎస్కార్ట్ వాహ‌నాలతో పాటు ఓ జామ‌ర్ వాహ‌నం ఉంటుంది. స్టాలిన్‌కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భ‌ద్రత‌ను క‌ల్పిస్తున్నారు. సీఎం కాన్వాయ్‌లోని అడ్వాన్స్ పైలెట్ వాహ‌నం వెళ్లిన త‌ర్వాత అయిదు నిమిషాల ముందు మాత్రమే ట్రాఫిక్‌ను ఆప‌నున్నారు.

మరోవైపు, చెన్నైలో నేటి నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బ‌డులు తెరిచారు. ఇవాళ ఉద‌యం సీఎం స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన స్టాలిన్‌ విద్యార్ధులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also…  Crime News: చిత్తూరులో రూ.10 లక్షల కర్ణాటక మద్యం స్వాధీనం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..