సుశాంత్ కేసు: మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తును చేసిన
Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలోనూ దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తును చేసిన నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సబీ) అధికారులు ఇప్పటికే రియా సోదరుడు షోవిక్, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందాలను అరెస్ట్ చేశారు. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. సుశాంత్ ఇంట్లో పనిచేసిన వంటవాడు దీపేష్ సావంత్ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో దీపేష్ సావంత్ ఇవాళ విచారణకు హాజరు కాగా.. అతడి దగ్గర నుంచి పలు విషయాలను రాబట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో దీపేష్ ప్రమేయం ఉందని నిర్ధారణకు వచ్చిన ఎన్సీబీ అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆదివారం ఉదయం 11గంటలకు ఎస్పాన్లెట్ కోర్ట్ ముందు హాజరుపరచనున్నారు.
మరోవైపు ఈ కేసుపై మాట్లాడిన ఎస్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా.. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుమందిని అరెస్ట్ చేశాము. వారిలో ముగ్గురిని(షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిందా, జైద్) రిమాండ్కు తరలించాము అని అన్నారు. కాగా జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించగా.. ఈ కేసుపై సీబీఐ, ఈడీ, ఎన్సీబీ విచారణను జరుపుతున్న విషయం తెలిసిందే.
Read More:
అనుష్క సాయాన్ని మరవను.. ఇప్పటికీ మొదటి ఫోన్ తనకే చేస్తా: తమన్నా