Supreme Court: బీబీసీ బ్యాన్కు నో చెప్పిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు ఇంత రిలీఫ్ ఎలా అడుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించాలని సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ రాజకీయ రచ్చ జరిగింది. ఈ క్రమంలో.. కేంద్రం ఆ డాక్యుమెంటరీని, దానికి సంబంధించిన లింకులను భారత్లో బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ వ్యవహరం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పింకీ ఆనంద్ వాదిస్తూ, బిబిసి ఉద్దేశపూర్వకంగానే ఇమేజ్ను కించపరిచిందని వాదించారు. ఇది పూర్తిగా తప్పు అని మీరు దీనిపై ఎలా వాదించగలరని ఈ కేసులో జస్టిస్ ఖన్నా అన్నారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీరు అలాంటి ఉపశమనం ఎలా అడగగలరు అంటే కోర్టు డాక్యుమెంటరీని నిషేధించగలదా? అంటూ ప్రశ్నించింది.
ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, ఈ పిటిషన్ తప్పు అని, అటువంటి ఉత్తర్వులను ఎస్సీ ఎలా పాస్ చేస్తుందని కోర్టు పేర్కొంది. డాక్యుమెంటరీలు దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్నే దేశంలో సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
అంతకుముందు సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మూడు వారాల్లో ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాలని తేల్చి చెప్పింది. ఈ విచారణను ఏప్రిల్కు వాయిదా వేసింది.
ఇక, గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్లు కనిపించకుండా సెన్సార్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




