AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: అసెంబ్లీలో గత ఏడాది బడ్జెట్‌ చదివిన ముఖ్యమంత్రి.. పొరపాటును గుర్తించిన తర్వాత ఏం జరిగిందంటే..

రాజస్థాన్ అసెంబ్లీలో సీఎం గెహ్లాట్ గతేడాది బడ్జెట్‌ను చదవగానే ఒక్కసారిగా నవ్వులు పూశాయి. తాను గత ఏడాది బడ్జెట్ కాపీ తెచ్చుకున్నట్లుగా..

Budget 2023: అసెంబ్లీలో గత ఏడాది బడ్జెట్‌ చదివిన ముఖ్యమంత్రి.. పొరపాటును గుర్తించిన తర్వాత ఏం జరిగిందంటే..
Chief Minister Ashok Gehlot
Sanjay Kasula
|

Updated on: Feb 10, 2023 | 4:12 PM

Share

రాజస్థాన్‌ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవాళ జరిగిన బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది. ముందుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ఓ పొరపాటు సొంత పార్టీ వారితోపాటు విపక్ష సభ్యులు కూడా నవ్వుకున్నారు. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టే క్రమంలో గత ఏడాది బడ్జెట్‌ ప్రతులను అసెంబ్లీకి తీసుకొచ్చారు సీఎం అశోక్‌ గెహ్లాట్‌. 2023-24 బడ్జెట్‌ను చదివే క్రమంలో గత బడ్జెట్‌ను అంటే 2021-22 బడ్జెట్ ప్రతులను సీఎం అశోక్ గెహ్లాట్‌ చదవడం మొదలు పెట్టారు. అయితే, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీఎం పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే అసలు విషయం సీఎం చెవిలో చెప్పారు. మీరు చదువుతున్న కాపీ గత సంవత్సరం బడ్జెట్ ప్రతులు అని తెలిపారు. కాసేపటికి తప్పు తెలుసుకున్న సీఎం అశోక్‌ గెహ్లాట్‌ నాలుక కరుచుకున్నారు.

తాను ఎంత పొరపాటు చేశానో తెలుసుకుని కొత్త బడ్జెట్‌ను చదివారు. ఏడు నిమిషాల పాటు పాత బడ్జెట్‌ను చదువుతూ ఉండటంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పాత బడ్జెట్‌ను చదువుతున్నారనే విషయాన్ని హౌజ్‌ గ్యాలరీలో కూర్చొని ఉన్న ఫైనాన్స్‌ ఆఫీసర్లు చీఫ్‌ విప్‌ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో అసలు సంగతిని ఆయన గుర్తించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టడమే కాదు.. నవ్వులు పూయిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

ఇదే అంశంపై రాజస్థాన్ బీజేపీ విపక్ష సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బీజేపీ సభ్యులు సభలో పెద్ద ఎత్తున నినాదులు చేశారు. బడ్జెట్‌ ముందుగానే కొందరికి ఎలా తెలుస్తుందని ప్రశ్నల వర్షం కురిపంచారు. కొందరికి బడ్జెట్ లీక్ అయ్యిందని స్పీకర్‌ పోడియంను ముట్టడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం