Railway Board chairman Suneet Sharma: రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్గా సునీల్ శర్మ నియామకం
Railway Board Chairman Suneet Sharma: రైల్వే బోర్డుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్ శర్మను ..
Railway Board Chairman Suneet Sharma: రైల్వే బోర్డుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్ శర్మను రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్, సీఈవోగా నియమించింది. సునీత్ 1978 బ్యాచ్కు చెందిన స్పెషల్ క్లాస్ అప్రరెంటిస్ అధికారి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న వినోద్ కుమార్ యాదవ్ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో సునీత్ శర్మను నియమించింది కేంద్రం ప్రభుత్వం. భారతీయ రైల్వే సంస్థలో సునీల్ దాదాపు 34 ఏళ్లకుపైగా వివిధ హోదాల్లో పని చేశారు. సాంకేతిక అంశాలపై ఆయన మంచి అవగాహన ఉంది.
ఆయన పని చేసిన వివిధ విభాగాల్లో పాలనా పరమైన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. రాయ్బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ గా కూడా సేవలందించారు. అలాగే సెంట్రల్ రైల్వేలో పుణె డీఆర్ఎంగా, చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా, వారణాసిలోని డీజిల్ లోకోమెటివ్ లో ప్రిన్సిపల్ మెకానికల్ ఇంజనీర్గా పని చేశారు. అంతేకాకుండా సునీల్ శర్మ విదేశాల్లో జరిగిన పలు రైల్వే సంస్థల శిక్షణ కార్యక్రమాలకు సైతం హాజరయ్యారు. ఇలా ఉద్యోగ బాధ్యతల్లో ఎన్నో సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించి రైల్వే బోర్డు ఛైర్మన్గా నియమించింది కేంద్రం.