AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్డ్ టీచర్ల ఫిర్యాదు.. జిల్లా అధికారిని ఫోన్‌‌లో మందలించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తర ప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యంవహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు.

రిటైర్డ్ టీచర్ల ఫిర్యాదు.. జిల్లా అధికారిని ఫోన్‌‌లో మందలించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
Union Minister Smriti Irani
Janardhan Veluru
|

Updated on: Dec 30, 2023 | 4:10 PM

Share

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తర ప్రదేశ్‌లో తాను ప్రాతినిథ్యంవహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు రిటైర్డ్ స్కూల్ టీచర్లు స్మృతి ఇరానీని కలిసి.. తమకు వేతన బకాయిలు చెల్లించలేదని మొరపెట్టుకున్నారు. దీనిపై జిల్లా అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను ఇవాళే విడుదల చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ విషయంలో కాస్త మానవత్వాన్ని చూపించాలంటూ సదరు అధికారిని సున్నితంగా మందలించారు. జిల్లా అధికారితో స్మృతి ఇరానీ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

జిల్లా అధికారితో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

ఇది అమేథీ.. ఎవరైనా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు ఫిర్యాదు చేయొచ్చని స్మృతి ఇరాన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని జిల్లా అధికారితో మాట్లాడి పెండింగ్ జీతభత్యాలను విడుదల చేయాలని కోరడం ఆసక్తికరంగా మారింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలో ఉండటం తెలిసిందే.

మున్షిగంజ్‌లో స్థానిక ప్రజలు కేంద్ర మంత్రిని కలిసి.. తాము ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో ఎంపీగా అమేథీలో పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపినట్లు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు 15 ఏళ్లు ఎంపీగా ఉన్నా.. అమేథీ ప్రజల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మున్షిగంజ్‌లో తనకు గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం తప్ప రాహుల్ గాంధీ స్థానిక ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. తమ ప్రభుత్వం పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధిని రాహుల్ పట్టించుకోలేదని ఆరోపించారు. అమేథీ నియోకవర్గంలో సరిగ్గా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌