AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: కంగనాకు షాకిచ్చిన ముంబై కోర్టు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆమె ఏ కామెంట్ చేసినా పోలీసులు, మీడియా, కోర్టులు ఆమెను వెంటాడుతున్నాయి. తాజాగా ఆమెపై వర్గవిద్వేషాలను రెచ్చగొట్టారంటూ....

Breaking News: కంగనాకు షాకిచ్చిన ముంబై కోర్టు
Rajesh Sharma
|

Updated on: Oct 17, 2020 | 3:57 PM

Share

Shock to Bollywood actress Kangana: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మరో షాక్ తగిలింది. ఆమెపై వర్గ ద్వేషాలను రెచ్చగొట్టారన్న అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంగనాతోపాటు ఆమె సోదరి రంగోలి ఛండేల్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు నిర్దేశించింది.

సాహిల్ అష్రఫలీ సయ్యద్ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం విచారించిన బాంద్రా కోర్టు.. సోషల్ మీడియాలో కంగనా, ఆమె సోదరి రంగోలి చేసిన కామెంట్ల ఆధారంగా వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కంగనా కామెంట్లు హిందూ, ముస్లింల మధ్య వర్గ విద్వేషాలను పెంచేవిగా వున్నాయన్నది ఆమెపై ప్రధాన అభియోగం.

అష్రఫలీ సయ్యద్ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్‌దేవ్ వై ఘులే.. కంగానా చేసిన కామెంట్లు వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేవిగా వున్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాంతో ఆమెతోపాటు ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు.

Also read: దుబ్బాకలో వేడెక్కుతున్న ప్రచారం

Also read: చైనాకు భారత్ మరో ‘చెక్‘