AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. భారత్ 190 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ సులువుగా చేధించి విజయం సాధించింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

England vs India: రెండో టీ20లో భారత్ ఓటమి.. టీమిండియా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..
England
Venkatrao Lella
|

Updated on: Jul 04, 2026 | 10:41 PM

Share

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి చెందింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4  వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 20 ఓవర్లలో 190-7 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 19 ఓవర్లలో 191-6  పరుగులతో గెలుపును సొంతం చేసుకుంది. తొలి టీ 20 వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో టీ20లో భారత్ రాణించలేకపోయింది. దీంతో రెండో టీ20 ఇంగ్లండ్ వశమైంది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 43(24), ఇషాన్ కిషన్49(40), శ్రేయస్ అయ్యర్37(22), తిలక్ శర్మ 24(11) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 39(15), టామ్ బాంటన్ 39(32), జాకబ్ బెథెల్ 76(46) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3, జోఫ్రా ఆర్చర్ 1, విల్ జాక్స్ 1 వికెట్ తీశారు.

కాగా తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. 20 ఓవర్లలో 189-7 పరుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (59), శ్రేయ‌స్ అయ్యర్ (47 బంతుల్లో 68) పరుగులతో రాణించారు. ఆఖ‌ర్లో శివ‌మ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్‌)గా నలిచాడు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందారు.

Follow Us