ఛత్రపతి విగ్రహం తొలగింపు..లాల్బాగ్లో శివసేన నిరసనలు
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగింపుపై శివసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బెల్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై..
కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగింపుపై శివసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బెల్గాం జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనపై ముంబైలోని లాల్బాగ్లో శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. బ్యానర్లను ప్రదర్శించారు. దిష్టి బోమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ను పాటించకుండా.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా విగ్రహం తొలగింపును ఖండించారు. వెంటనే తొలగించిన ప్రదేశంలో తిరిగి విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ డిమాండ్ చేశారు.
Maharashtra: Shiv Sena workers staged a protest at Lalbagh in Mumbai against Karnataka government over the alleged removal of a statue of Chhatrapati Shivaji Maharaj at a village in Belgaum district. Norms of social distancing were flouted during the protest. (09.08.2020) pic.twitter.com/UBFYvbuBua
— ANI (@ANI) August 9, 2020
Read More :
కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా