విద్యుదాఘాతానికి మరో ఏనుగు బలి

|

Jul 23, 2020 | 6:18 PM

విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృత్యువాత పడింది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో చనిపోయిన ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు ఖునియా అటవీ రేంజ్ పరిధిలో విద్యుదాఘాతంతో మరణించినట్లు అధికారులు తెలిపారు.

విద్యుదాఘాతానికి మరో ఏనుగు బలి
Follow us on

దేశంలో వ‌రుస‌గా ఏనుగులు మృత్యువాత‌ప‌డుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో బాంబు పేలి గర్భిణీ ఏనుగు మరణించిన సంఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరో రెండు ఏనుగులు మృతిచెందాయి. అంతకు ముందు మూడు ఆడ ఏనుగులు మృతిచెందాయి. వారం వ్యవధిలోనే ఇవన్ని అనుమానాస్పదరీతిలో మృతిచెందాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో గజరాజు ప్రాణాలు కోల్పోయింది.

విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృత్యువాత పడింది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్ గురి పరిధిలోని బామన్ దంగా టీ ఎస్టేట్ సమీపంలో చనిపోయిన ఏనుగును అటవీ అధికారులు గుర్తించారు. 25 ఏళ్ల వయసుగల మగ ఏనుగు ఖునియా అటవీ రేంజ్ పరిధిలో విద్యుదాఘాతంతో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఏనుగు కళేబరాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత రెండు నెలల్లో 4 ఏనుగులు మరణించాయి. ఏనుగులతో పాటు క్రూర మృగాలు పంటపొలాలపై దాడి చేయకుండా గ్రామస్థులు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాత్రి సమయాల్లో వచ్చిన నాలుగు ఏనుగులు విధ్యుత్ షాక్ గురైనట్లు అధికారులు తెలిపారు. అటవీ సమీపంలోని గ్రామాల్లోనే ఈ ఘటనలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.