AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెయినర్ ఢీ కొట్టడంతో పేలిన కారు.. ఐదుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెయినర్ ఢీ కొట్టడంతో పేలిన కారు.. ఐదుగురు సజీవదహనం
uppula Raju
|

Updated on: Dec 22, 2020 | 9:51 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారు జామున యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగాలాండ్ అతి వేగంగా వస్తున్న ఓ కంటెయినర్ రాంగ్ రూట్ నుంచి కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో కారు ప్యూయల్ ట్యాంక్ పేలిపోయి మంటలు చెలరేగాయి. అందులో కాలిపోతున్న వ్యక్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కారు పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది. కాగా ఆ కంటెయినర్ కూడా రోడ్డు పక్కనే ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.