Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి ఎన్నికల ఫలితాలు..దేశవ్యాప్తంగా ఆసక్తి

|

Updated on: Dec 22, 2020 | 12:54 PM

ఆర్టికల్ 370 ను తొలగించిన తరువాత, జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ముగిసిన జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికలకు ఓట్ల లెక్కింపు నేడు జరుగుతోంది.

Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి ఎన్నికల ఫలితాలు..దేశవ్యాప్తంగా ఆసక్తి

ఆర్టికల్ 370 ను తొలగించిన తరువాత, జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ముగిసిన జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికలకు ఓట్ల లెక్కింపు నేడు జరుగుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని 280 జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) స్థానాలకు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన దాదాపు 4,181 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికలు నవంబర్ 28 న ప్రారంభమై డిసెంబర్ 19 తో ముగిశాయి.  ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు, పిడిపి తన ముగ్గురు సీనియర్ నాయకులను పోలీసులు నిర్బంధించినట్లు పేర్కొంది. ఈ విషయంపై పోలీసులు మౌనంగా ఉండగా, పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ చర్యను గూండా గిరిగా పేర్కొన్నారు. బిజెపి ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Dec 2020 12:42 PM (IST)

    గుప్ కర్ కూటమి 58 స్థానాల్లో ముందంజలో ఉంది

    జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల ఫలితాలకు సంబంధించి 280 స్థానాల్లో 164 సీట్లకు ట్రెండ్స్ వచ్చాయి. ఇందులో 58 స్థానాలతో గుప్ కర్ అలయన్స్ ఆధిక్యంలో ఉంది. కాగా, బిజెపి 49 తో వెనుకబడి ఉంది.కాంగ్రెస్ 18, జెకెఎపి 5 స్థానాల్లో లీడ్‌లో ఉండగా..  ఇతరులు 34 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 

  • 22 Dec 2020 12:22 PM (IST)

    47 స్థానాల్లో ఆధిక్యంలో బిజెపి, కాంగ్రెస్ 17, వెనకబడిన కూటమి

    జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి)  ఎన్నికల ఫలితాలలో 280  స్థానాలలో 146 స్థానాలకు ట్రెండ్స్ వచ్చాయి. ఇందులో 47 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 17, పిఎజిడి 48, జెకెఎపి 5  స్థానాల్లో లీడ్‌లో ఉండగ… 29 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. 

  • 22 Dec 2020 12:09 PM (IST)

    తాజా ట్రెండింగ్ వివరాలు : 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    జమ్మూ కాశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) లోని 280 సీట్ల ఫలితాల తాజా ట్రెండ్స్ ఇలా ఉన్నాయి.  29 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. గుప్ కార్ కూటమి  19, కాంగ్రెస్ 6, జెకెఎపి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ఇతరులు ఏడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  • 22 Dec 2020 11:44 AM (IST)

    బిజెపి ఇప్పుడు 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది

    డిడిసి ఎన్నికల ఫలితాల తాజా ట్రెండింగ్స్ ప్రకారం.. ఇప్పుడు బిజెపి మరింత ఆధిక్యంలో ముందుకు వెళ్తుంది.

    గుప్ కార్ కూటమి - 17

    బిజెపి- 28

    కాంగ్రెస్ - 6

    ఇతరులు - 17

    జెకెఎపి -4

  • 22 Dec 2020 11:24 AM (IST)

    ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బీజేపీ

    తాజా ట్రెండ్స్ ప్రకారం, బిజెపి అత్యధిక స్థానాల్లో ముందుంది. గుప్ కార్ కూటమి రెండవ స్థానంలో ఉంది.

    గుప్ కార్ - 13

    బిజెపి- 18

    కాంగ్రెస్ - 3

    ఇతరులు - 15

    జెకెఎపి -3

  • 22 Dec 2020 10:42 AM (IST)

    16 సీట్లలో ముందంజలో స్వతంత్రులు

    గుప్ కార్ కూటమి - 9

    బిజెపి- 9

    కాంగ్రెస్ - 2

    ఇతరులు - 16

    జెకెఎపి -3

  • 22 Dec 2020 10:39 AM (IST)

    ఈ బ్లాకుల్లో బిజెపి ముందుంది

    తాజా ట్రెండ్స్ ప్రకారం..విసు,పహల్గామ్,సహబాద్,ధుచానిపురా బ్లాకులలో బిజెపి ముందుంది.

    కూటమి- 9

    బిజెపి- 9

    కాంగ్రెస్ - 2

    ఇతరులు - 10

    జెకెఎపి -3

  • 22 Dec 2020 10:37 AM (IST)

    280 లో 30 సీట్ల పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి...

    జమ్మూ కాశ్మీర్ డిడిసికు సంబంధించి మొత్తం 280 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం, 30 సీట్ల పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ వచ్చాయి.

    గుప్ కర్ కూటమి - 11

    బిజెపి- 9

    కాంగ్రెస్ - 2

    ఇతర -8

  • 22 Dec 2020 10:35 AM (IST)

    నేషనల్ కాన్పరెన్స్ ఖాతాలో తొలి సీటు

    గుప్ కార్ అలయన్స్ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఆఫ్రోజా బేగం యుఎల్బి బండిపుర వార్డ్ నంబర్ 1 సీటు నుంచి గెలిచారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 

  • 22 Dec 2020 10:30 AM (IST)

    కేవలం 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో కాంగ్రెస్

    ప్రస్తుత ట్రెండ్స్‌ని బట్టి చూస్తే కూటమి ముందంజలో ఉంది. బీజేపీ కూడా 8 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తుంది. అదే సమయంలో, కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందుంది.

    కూటమి - 11

    బిజెపి -8

    కాంగ్రెస్ - 2

    ఇతరులు - 4

    జెకెఎపి -3

  • 22 Dec 2020 10:24 AM (IST)

    భారీ భద్రత మధ్య లెక్కింపు

    కతువా, జమ్మూ కాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ సెంటర్ వెలుపల భద్రతా దళాలను భారీగా మోహరించారు.

  • 22 Dec 2020 10:22 AM (IST)

    మారుతోన్న ట్రెండ్స్

    కూటమి - 10

    బిజెపి -6

    కాంగ్రెస్ - 2

    ఇతరులు - 4

    జెకెఎపి -2

  • 22 Dec 2020 10:17 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్..

    ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతోంది. గుప్ కార్ కూటమి ముందంజలో ఉంది.

    గుప్ కార్ కూటమి - 8

    బిజెపి -4

    కాంగ్రెస్ - 1

    ఇతరులు - 7

    జెకెఎపి -2

  • 22 Dec 2020 10:15 AM (IST)

    ప్రారంభ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి..

    గుప్ కార్ డిక్లరేషన్ అలయెన్స్ - 2

    జెకెఎపి -1

    కాంగ్రెస్ - 1

    ఇతరులు - 3

  • 22 Dec 2020 10:05 AM (IST)

    బిజెపి అతిపెద్ద పార్టీ అవతరిస్తుంది- రవీంద్ర రైనా

    ఫలితాల నేపథ్యంలో  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా కీలక కామెంట్స్ చేశారు. ఈసారి డిడిసి ఎన్నికల్లో కాశ్మీర్ లోయలో కమలం వికసిస్తుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.

  • 22 Dec 2020 10:03 AM (IST)

    పోలీసులు అదుపులో 20 మంది నేతలు

    జమ్మూ కాశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండలి (డిడిసి) ఎన్నికలను లెక్కించడానికి ఒక రోజు ముందు సోమవారం, ముందుజాగ్రత్త చర్యగా అధికారులు కనీసం 20 మంది రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకున్నారు

  • 22 Dec 2020 10:01 AM (IST)

    భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ

    జమ్మూ కాశ్మీర్‌లో డిడిసి ఎన్నికలకు ఓటింగ్ ఫలితాలు నేడు వెల్లడవ్వనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

  • 22 Dec 2020 10:00 AM (IST)

    బరిలో 4,181 మంది అభ్యర్థులు

    20 జిల్లాల్లో 280 స్థానాలకు 4,181 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఇందులో 450 మంది మహిళలు కూడా ఉన్నారు. ఎనిమిది దశల ఓటింగ్ నవంబర్ 28 న ప్రారంభమై డిసెంబర్ 19 తో ముగిసింది. 57 లక్షల మంది ఓటర్లలో ఓటింగ్‌లో పాల్గొన్నారు.

  • 22 Dec 2020 09:56 AM (IST)

    ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి

    రాజకీయ నిపుణుల విశ్లేషణల ప్రకరాం , గుప్ కార్ డిక్లరేషన్ అలయెన్స్  ఎక్కువ సీట్లు గెలచుకుంటుందని చెబుతున్నారు.  అదే సమయంలో, భారతీయ జనతా పార్టీ రెండవ స్థానంలో, కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. 

  • 22 Dec 2020 09:52 AM (IST)

    ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క వ్యూహం ఏమిటి..?

    కాంగ్రెస్ తొలి దశలో గుపాకర్  కూటమిలో ఒక భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఆ తరువాత మిగిలిన ఏడు దశల్లో ఒంటరిగా ఎన్నికలలో బరిలోకి దిగింది. బిజెపి పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కాంగ్రెస్ ఇప్పటికీ తెర వెనుక ఆ కూటమిలో భాగమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు.

  • 22 Dec 2020 09:36 AM (IST)

    ఏ దశలో ఎంత శాతం పోలింగ్

    డిడిసి ఎన్నికల్లో మొత్తం 8 దశల ఓటింగ్ జరిగింది. ఏ దశలో ఓటింగ్ ..ఎంత శాతం జరిగిందో వివరాలు

    మొదటి దశ: 51.76%

    రెండవ దశ: 48.62%

    మూడవ దశ: 50.53%

    నాల్గవ దశ: 50.08%

    ఐదవ దశ: 51.20%

    ఆరవ దశ: 51.51%

    ఏడవ దశ: 57.22%

    ఎనిమిదవ దశ: 83.5%

  • 22 Dec 2020 09:26 AM (IST)

    ప్రధాన పోటీ వీరి మధ్యే...

    ప్రధాన పోటీ బిజెపి, గుపాకర్ అలయన్స్ (నేషనల్ కాన్ఫరెన్స్ + పిడిపి), కాంగ్రెస్ మధ్య ఉంది. ఈ ఎన్నిక చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఎందుకంటే ఆర్టికల్ 370 ను తొలగించిన తరువాత.. మొదటిసారి జమ్మూ కాశ్మీర్‌లో ఓటింగ్ జరిగింది, ఇందులో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ ఎన్నికలపై బిజెపి చాలా ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ అనుభవజ్ఞులైన నాయకులలో చాలామంది పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా చాలా మంది ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని తెలుసుకోబోతున్నారు. 

  • 22 Dec 2020 09:07 AM (IST)

    ఎన్నికల్లో తేలనున్న కీలక నేతల భవితవ్యం..

    మాజీ రాజ్యసభ సభ్యుడు త్రిలోక్ సింగ్ బజ్వా,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాజ్ మొహియుద్దీన్, మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు షామ్ చౌదరి, శక్తి పరిహార్, షబ్బీర్ ఖాన్, ఎజాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే షోయబ్ లోన్, భరత్ భూషణ్, కాంత అండోత్రా, పిడిపికి చెందిన ఇజాజ్ మీర్, మాజీ ఎమ్మెల్సీ షెహ్నాజ్ గనై, మాజీ స్వతంత్ర ఎమ్మెల్యే చరణ్జిత్ సింగ్, మాజీ జాతీయ సదస్సు ఎమ్మెల్యే జగ్జీవన్ లాల్, జావేద్ రానా కుమారుడు జిషన్ రానా, మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ పథానియా భార్య జూహి మన్హాస్, మాజీ ఎమ్మెల్యే హర్ష్ దేవ్ భార్య మంజు సింగ్ వంటి ప్రముఖుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. 

  • 22 Dec 2020 08:58 AM (IST)

    జమ్మూ కాశ్మీర్‌లో డిడిసి ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి

    ప్రత్యేక హోదాను తొలగించిన తరువాత మొదటిసారి జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల ఫలితాలు(జిల్లా అభివృద్ధి మండలి) వెలువడనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాలు ఈ ఎలక్షన్ రిజల్ట్స్‌ను కీలకంగా భావిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిందనేది ఈ ఎన్నికల్లో తేలనుంది. 

Published On - Dec 22,2020 12:42 PM

Follow us