AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POK, ఉగ్రవాదులను భారత్‌కు అప్పగిస్తేనే చర్చలు.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదుః ప్రధాని మోదీ

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే ఒప్పందంపై జరిగిన చర్చ సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం మాత్రమే అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే మాత్రమే చర్చలు జరుగుతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు.

POK, ఉగ్రవాదులను భారత్‌కు అప్పగిస్తేనే చర్చలు.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదుః ప్రధాని మోదీ
Pm Modi With Us Vice President Jd Vance
Balaraju Goud
|

Updated on: May 11, 2025 | 6:35 PM

Share

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే ఒప్పందంపై జరిగిన చర్చ సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం మాత్రమే అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే మాత్రమే చర్చలు జరుగుతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పోన్ చేశారు. భారత్-పాక్ మద్య నెలకొన్న ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చించారు. కాల్పుల విరమణ దిశగా పాకిస్థాన్‌ను ఒప్పించేందుకు తాము సిద్ధమని జేడీ వాన్స్ మోదీకి వివరించారు. దీనికి మోదీ ప్రతిస్పందనగా.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించి పాక్ కాల్పులు జరిపితే.. తాము మౌనంగా ఉండబోమని.. ధీటుగా బదులిస్తామని జేడీ వాన్స్‌కు ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.

“కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది. ఇంకేమీ మాట్లాడటం లేదు. అలాగే ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. నాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు” అని ప్రధాని మోదీ, జేడీ వాన్స్‌తో చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై భారతదేశం ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “మేము ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని కోరుకోవడం లేదు. మాకు ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు” అని ఆయన చెప్పినట్లు సమాచారం.

రెండు దాయాది దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రత్యక్షంగా ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ దాడులు జరిగిన అదే రాత్రి, భారతదేశం పాకిస్తాన్ అంతటా 26 స్థావరాలపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది.

భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, రెండు దేశాలు ఒకదానికొకటి సైనిక కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. అంతర్జాతీయ సమాజానికి, పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారతదేశం సరిహద్దు దాడులను సహించదని, అలాంటి ఏవైనా చర్యలను అధిక శక్తితో ఎదుర్కొంటామని ప్రదాని మోదీ వెల్లడించారు. ఈ పరిణామం, సరిహద్దు ఉగ్రవాదం, రెచ్చగొట్టే చర్యలను ఎదుర్కోవడంలో భారతదేశ విధానం మరింత చురుకైన, నిర్ణయాత్మక వ్యూహానికి మారిందని, దాని జాతీయ భద్రత విషయంలో రాజీకి అవకాశం లేదని సూచిస్తుంది.

ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. “మనం కొత్త సాధారణ స్థితిలో ఉన్నాం, ప్రపంచం దీనిని అంగీకరించాలి. పాకిస్తాన్ దీనిని అంగీకరించాలి, ఇది యథావిధిగా వ్యాపారం కాదు” అని మోదీ అన్నారు. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ మిస్సైల్స్‌తో దాడి చేస్తుందని భారత ప్రధానమంత్రి మోదీ గట్టి సందేశం ఇచ్చారు. మళ్లీ పాక్ కాల్పులకు తెగబడితే.. ధీటుగా స్పందించాలని భారత ఆర్మీని ప్రదాని మోదీ ఆదేశించారు. అటు నుంచి గోళీ మన దేశంలోకి వస్తే.. ఇటు నుంచి మిస్సైల్స్‌ను వదలండి అని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..