AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘనంగా రక్షాబంధన్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టిన టిబెటన్ మహిళలు..

రక్షా బంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమను ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని అనేక మంది ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్‌కు పలువురు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా రక్షాబంధన్.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టిన టిబెటన్ మహిళలు..
Rss Chief Mohan Bhagwat
Balaraju Goud
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 1:43 PM

Share

రక్షా బంధన్ పండుగను ఈ శనివారం(ఆగస్టు 9) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమను ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని అనేక మంది ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్‌కు పలువురు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

రక్షా బంధన్ సందర్భంగా, నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ టిబెటన్ మహిళా సంఘం, భారత్ టిబెట్ సహకార వేదిక సోదరీమణులు RSS చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సేవిక సమితి సోదరీమణులు, మహల్ ప్రాంగణ నివాసితులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ లోని అనేక మంది ముఖ్యులకు భారత్ టిబెట్ సహయోగ్ ఉద్యమ మహిళా కార్యకర్తలు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మహిళలకు స్వీట్లు బహుకరించారు.

అంతకుముందు, ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కట్టి, ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సమయంలో, ప్రధానమంత్రి మోదీ కూడా విద్యార్థులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వారితో సమయం గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో ఒక పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రక్షా బంధన్ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన రాశారు.

ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున అన్నదమ్ముల ప్రేమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుపై రక్ష సూత్రాన్ని కడతారు. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో అంతర్భాగం మరియు మతపరమైన మరియు పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రక్షా బంధన్ పండుగ సారాంశం ఏమిటంటే, తమ సోదరుల దీర్ఘాయుష్షు, ఆనందం కోసం సోదరీమణుల ప్రార్థనలు చేస్తారు. తమ సోదరీమణులను రక్షించడానికి సోదరుల వాగ్దానం చేస్తారు. ఈ సంవత్సరం ఈ పండుగ సంబంధాలకు మాత్రమే కాకుండా, దేశం, సమాజం పట్ల బాధ్యత బంధానికి కూడా చిహ్నంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి