
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలోని మటోడా ప్రాంతంలో ఆదివారం (నవంబర్ 2)న ఆగివున్న ట్రక్కును ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికులతో నిండిన టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. వాహనంలో ఉన్నవారంతా జోధ్పూర్లోని సుర్సాగర్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా బికనీర్లోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లారు. దైవ దర్శనానంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.
A horrific road accident in Rajasthan’s Jodhpur district claimed 18 lives when an uncontrolled tempo traveller collided head-on with a truck near Matoda village in Phalodi. All victims were residents of Mathania. pic.twitter.com/IPyjRBPZrQ
ఇవి కూడా చదవండి— Naveen Patel (@naveenptel) November 2, 2025
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోధ్పూర్కు తిరిగి వెళ్తున్న టెంపో ట్రావెలర్ మటోడా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రైలర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అనేక మంది ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు. రాత్రి వేళ కావటం, డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వాహనం హై స్పీడ్తో వెళ్తుండటంతో డ్రైవర్ ఆగిపోయిన ట్రైలర్ను గమనించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు ఇతర వాహనదారులు సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సేవలు వచ్చేలోపు బాధితులను బయటకు తీయడంలో సహాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
फलोदी के मतोडा क्षेत्र में सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दुखद एवं हृदयविदारक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
जिला प्रशासन के अधिकारियों को सभी घायलों का समुचित उपचार सुनिश्चित करने हेतु निर्देश दिए गए हैं। प्रभु से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति दें…
— Bhajanlal Sharma (@BhajanlalBjp) November 2, 2025
ఫలోడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఇతర సీనియర్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. గాయపడిన వారిని తక్షణ చికిత్స కోసం గ్రీన్ కారిడార్ ద్వారా ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. ఈ సంఘటనలో గాయపడిన వారందరికీ సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్యం అందిచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…