AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ

హైదరాబాద్(Hyderabad) పర్యటన ముంగిచుకున్న తరువాత ప్రధాని మోదీ తమిళనాడు రాజధాని చెన్నైకు(Chennai) చేరుకున్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళ భాష,....

Tamil Nadu: తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. ప్రధాని మోదీ
Modi
Ganesh Mudavath
|

Updated on: May 26, 2022 | 9:49 PM

Share

హైదరాబాద్(Hyderabad) పర్యటన ముంగిచుకున్న తరువాత ప్రధాని మోదీ తమిళనాడు రాజధాని చెన్నైకు(Chennai) చేరుకున్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళ భాష, సంస్కృతులపై ప్రశంసలు కురిపించారు. తమిళ భాష శాశ్వతమైనదని అన్నారు. అన్ని రంగాల్లో తమిళనాడువాసులు ప్రతిభ కనబరుస్తున్నారని మోదీ అన్నారు. తమిళ భాష, సంస్కృతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని.. ఈ జనవరిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లాసికల్‌ తమిళ్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించామన్నారు. దేశంలోని పలు చోట్ల మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసి వాణిజ్య వ్యవస్థలో కీలక మార్పును తీసుకొస్తామని వివరించారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వెల్లడించారు. మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకను ఆదుకున్నాం. అక్కడి క్లిష్ట పరిస్థితులతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారని మాకు అర్థమైంది. పొరుగున ఉన్న భారత్‌కు సన్నిహిత దేశమైన శ్రీలంక ఆర్థిక సహాయంతో పాటు ఆహారం, ఔషధాలను అందిస్తున్నాం. బెంగళూరు- చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్‌వే రెండు కీలక అభివృద్ధి కేంద్రాలను కలుపుతోంది. చెన్నై పోర్ట్‌ను మధురవాయల్‌కు అనుసంధానించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ రహదారి చెన్నై పోర్టును మరింత సమర్థంగా తీర్చిదిద్దుతాం. ఇది చెన్నై నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుంది.

 – ప్రధాని నరేంద్ర మోదీ

ఇవి కూడా చదవండి

డీఎంకే సారథ్యంలో తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం స్టాలిన్‌ ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటనతో చెన్నైలో దాదాపు 20వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!