Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ నెక్స్ట్ స్టెప్‌ ఏంటి? కాంగ్రెస్‌తో డీల్‌ కుదరని పీకే కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? సొంత పార్టీని ఆయన ప్రకటించబోతున్నారా? పీకే సొంత పార్టీని ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ నెక్స్ట్ స్టెప్‌ ఏంటి? కాంగ్రెస్‌తో డీల్‌ కుదరని పీకే కొత్త పార్టీ పెట్టబోతున్నారా?
Prashant Kishor
Follow us

|

Updated on: May 02, 2022 | 10:10 AM

Prashant Kishor Of Own Political Platform: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? సొంత పార్టీని ఆయన ప్రకటించబోతున్నారా? పీకే సొంత పార్టీని ప్రారంభిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గర ఆయన పార్టీ పేరును రిజిస్టర్‌ చేసినట్టు చెబుతున్నారు. ఇవాళే ఆయన కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు కూడా కొనసాగాయి. బిహార్‌ చేరుకున్న ఆయన భావ సారూప్యత ఉన్న పార్టీలతో చర్చించిన తర్వాత పార్టీ ఏర్పాటు విషయాన్ని వెల్లడిస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌తో చర్చలు బెడిసికొట్టాక ప్రశాంత్‌ కిశోర్‌ తదుపరి వ్యూహంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్‌లో చేరాలని, ఎంపవర్డ్‌ గ్రూప్‌ సభ్యుడిగా ఉండాలన్న ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిపాదనను తిరస్కరించారు పీకే. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. తాను కాంగ్రెస్‌లో చేరట్లేదని, తన కన్నా కాంగ్రెస్‌కు సమర్థ నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని సూచించారు. కాంగ్రెస్‌లో వేళ్లూనుకున్న సంస్థాగత సమస్యల పరిష్కరానికి సంస్కరణలు చేపట్టాలన్నారు. అంతకుముందు 2024 లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​సన్నద్ధత కోసం సోనియాగాంధీ సహా కాంగ్రెస్‌ సీనియర్​ నేతలకు పీకే పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పీకే కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో కథ అడ్డం తిరిగింది. దీనికి కారణం కాంగ్రెస్‌ నేరుగా పోటీ పడుతున్న పార్టీలతో పీకే సంస్థ ఐ-ప్యాక్‌ ఒప్పందమేనని ప్రచారం జరిగింది. పీకేకు పలు రాజకీయా పార్టీలతో అనుబంధం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేయడంత పీకే పేరు దేశమంతా మార్మోగింది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్‌తో ఒప్పందం అనుకున్నంతగా జరగనప్పటికీ, కిషోర్‌కు అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. అతను 2014 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంచుకున్నప్పుడు.. 2014లో కీర్తికి ఎదిగాడు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మొదటి ఇన్నింగ్స్‌కు నాంది పలికాడు. ఆ తర్వాత, 2017లో, పోల్ స్ట్రాటజిస్ట్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ కోసం ప్రచారంలో పనిచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో వారి భారీ విజయానికి దోహదపడ్డారు. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, రెండేళ్లలో దాదాపు 35 ప్రచారాలకు రూపకల్పన చేసి విజయం సాధించారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, రెండో ఇన్నింగ్స్‌లో అధికారంలోకి రావడంతో ఆప్‌కి కూడా ఆయన మద్దతు లభించింది. ఇటీవల భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్‌కు, భారత కమ్యూనిస్ట్ పార్టీ వంటి ఇతర పార్టీలకు మద్దతునిచ్చి, మమతా బెనర్జీ మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలా చేసిన పవర్-ప్యాక్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలను మర్చిపోకూడదు.

Read Also…  Man Drinks Urine: వీడు మరీ దారుణంగా ఉన్నాడేంట్రా బాబు.. యవ్వనంగా కనిపించాలంటే ఆది తాగాలంటున్నాడు..!