
PM Modi: దేశంలో కరోనా ఉదృతిని, కేసుల పెరగుదల, అలాగే ఆక్సిజన్ కొరత, మందుల లభ్యతపై గురించి ఈరోజు ఉదయం 9.30 గంటలకు ప్రధాన మంత్రి మోదీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రులు, స్మశాన వాటికలు రద్దీగా మారిపోయాయి. అటు ఆక్సిజన్ కొరతతో కూడా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టీకా లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
కరోనా కేసుల పెరుగుదలకు ముందు అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ ర్యాలీలు చేపట్టడం.. అందులో ఏ ఒక్కరు కరోనా నియమాలను పాటించలేదు. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలు ఉల్లఘించి ర్యాలీలు చేపట్టారు. అంతేకాకుండా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభంలోనే లక్షల మందితో సభలు, ర్యాలీలు నిర్వహించడం వలన కరోనా కేసులు ఈ రేంజ్ లో పెరగడానికి కారణమని నిపుణులు అంటున్నారు.
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకెక్కిన ఎన్నికల కమిషన్, రేపు విచారణ,