PM Modi: కార్మికులకు ఆర్థిక సహాయం కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం: ప్రధాని మోదీ

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి దేశ కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ప్రకటన చేశారు. వచ్చే విశ్వకర్మ జయంతి రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ఫర్నిచర్ లేదా కలపను తయారు చేసే, సెలూన్లు నడుపుతున్న, బూట్లు తయారు చేసే, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు..

PM Modi: కార్మికులకు ఆర్థిక సహాయం కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం: ప్రధాని మోదీ
Narendra Modi

Updated on: Aug 15, 2023 | 9:21 AM

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి దేశ కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ప్రకటన చేశారు. వచ్చే విశ్వకర్మ జయంతి రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ఫర్నిచర్ లేదా కలపను తయారు చేసే, సెలూన్లు నడుపుతున్న, బూట్లు తయారు చేసే, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.

‘స్వానిధి యోజన’ ద్వారా దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్న దేశంలోని కోట్లాది మంది కార్మికులకు కూడా ఇలాంటి సహాయాన్ని అందించాలని భావిస్తున్నట్లు అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినవారే.

ఇవి కూడా చదవండి

 

15,000 కోట్ల వరకు సహాయం:

‘విశ్వకర్మ యోజన’ను తీసుకువస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రానున్న విశ్వకర్మ జయంతి రోజున ప్రభుత్వం రూ.13 నుంచి 15 వేల కోట్లతో పథకాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. సాంప్రదాయ నైపుణ్యాలతో తమ కడుపుని పోషించే వారికి ఇది సహాయపడుతుంది. వారు పనిముట్లు, చేతులతో పని చేయడం ద్వారా తమను తాము పోషించుకుంటారు.

 


కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ను తీసుకువస్తుందని చెప్పారు. వారికి ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి