AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశ భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి ప్రకృతి సేద్యమే కీలకం- ప్రధాని మోదీ

సేంద్రీయ వ్యవసాయం తన హృదయానికి దగ్గరగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తమిలనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కోడిసియా కాంప్లెక్స్‌లో సేంద్రియ వ్యవసాయ సదస్సును ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. అనంతరం అక్కడి రైతులో నేరుగా మాట్లాడి సేంద్రీయ వ్యవసాయంలో వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

PM Modi: దేశ భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి ప్రకృతి సేద్యమే కీలకం- ప్రధాని మోదీ
Pm Modi Coimbatore
Anand T
|

Updated on: Nov 19, 2025 | 5:10 PM

Share

తమిళనాడు పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కోడిసియా కాంప్లెక్స్‌లో జరిగిన సేంద్రీయ వ్యవసాయ సదస్సును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అనేక మంది రైతులతో మాట్లాడి వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయం తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని అన్నారు. దేశ భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి సేంద్రీయ వ్యవసాయం, స్థిరమైన ప్రకృతి దృశ్య పద్ధతులను ప్రోత్సహించడం చాలా అవసరమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

గత 11 సంవత్సరాలలో, దేశంలోని మొత్తం వ్యవసాయ రంగం ఒక పెద్ద పరివర్తనను చూసింది. ఈ కాలంలో, మన దేశ వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. రైతుల కృషి, ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల కారణంగా, భారత వ్యవసాయం పురోగతిలో కొత్త శిఖరాలకు చేరుకుంది అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది మాత్రమే, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులకు రూ. 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయం లభించిందన్నారు.

అలాగే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఖరీదైన ఎరువులపై జీఎస్టీ తగ్గింపు రైతులకు అదనపు ప్రయోజనాలను అందించిందన్నారు. ఈ చర్యలన్నీ రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి ఉత్పాదకతను మెరుగుపరచడంలో సహాయపడ్డాయని ఆయన తెలిపారు. రూ. 4 లక్షల కోట్ల వరకు నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి. ఇది రైతుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడిందని ఆయన అన్నారు .

దేశ భవిష్యత్తుకు, రైతుల సంక్షేమానికి సేంద్రీయ వ్యవసాయం, స్థిరమైన ప్రకృతి దృశ్య పద్ధతులను ప్రోత్సహించడం చాలా అవసరమని.. ప్రపంచ మార్కెట్లలో మన ఆహార లభ్యతను పెంచాలని అన్నారు. దీనికోసం, రసాయన రహిత వ్యవసాయమైన సేంద్రీయ వ్యవసాయం, దాని ప్రపంచ అభివృద్ధిని విస్తరించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.