
దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటికే 21 విడతల డబ్బులను విజయవంతంగా అందుకున్న రైతులు, ఇప్పుడు 22వ విడత కోసం వేయీ కళ్లతో ఎదురుచూస్తున్నారు. మార్చి నెలలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
పీఎం కిసాన్ పథకం నిబంధనల ప్రకారం.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున ఏడాదికి రూ. 6000 రైతులకు అందుతాయి. గత 21వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19, 2025న కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. ఆ లెక్కన తదుపరి నాలుగు నెలల కాల పరిమితి ముగిసే మార్చి 2026లో 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరింది. గత విడతలోనే రూ. 18,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు రూ. 4 లక్షల కోట్లను కేంద్రం రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేయడం గమనార్హం.
22వ విడత ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది.
రైతులు తమ మొబైల్ నుంచే చెక్ చేసుకోవచ్చు..