కరోనా ఎఫెక్ట్.. హోళీ వేడుకలకు ప్రధాని మోదీ దూరం

కరోనా వ్యాప్తి కారణంగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తాను రంగుల పండుగ-హోళీ సంబరాల్లో పాల్గొనబోనని ఆయన ట్వీట్ చేశారు.

కరోనా ఎఫెక్ట్.. హోళీ వేడుకలకు ప్రధాని మోదీ దూరం

Edited By:

Updated on: Mar 04, 2020 | 1:09 PM

కరోనా వ్యాప్తి కారణంగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తాను రంగుల పండుగ-హోళీ సంబరాల్లో పాల్గొనబోనని ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాధి లక్షణాల నివారణకు జనాలు గుమికూడరాదని నిపుణులు సలహా ఇఛ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధిని అదుపు చేయాలంటే.. బహిరంగ ప్రదేశాల్లో జనం పెద్ద సంఖ్యలో చేరకుండా చూడడం మంచిదని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని, అందువల్ల ‘హోళీ మిలన్ ‘ వంటి సంబరాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని, దీనిపై తాను ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్ధించానని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని మోదీ నిన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల  10 న హోళీ పండుగ జరుపుకోనున్నారు.

కాగా-మంగళవారం వరకు 48 గంటల్లో ఇండియాలో మూడు తాజా కరోనా కేసులు వేర్వేరు నగరాల్లో నమోదయ్యాయి.  ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ సిటీల్లో ఇవి నమోదైన విషయం గమనార్హం. అయితే ఈ వ్యాధి నివారణకు ఆయా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు అన్ని ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నాయి. కానీ కరోనా భయంతో హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో మాస్కుల కొరత ఏర్పడింది.

Follow Us