పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?
Parliament

Updated on: Nov 08, 2025 | 1:25 PM

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాలతో పాటు ఇతర అంశాలపై సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై డిసెంబర్ 19 వరకు జరుగుతాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శనివారం (నవంబర్ 8) తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. 2025 డిసెంబర్ 1 నుండి 19 వరకు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని మంత్రి ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. పార్లమెంటరీ పని అవసరాల ఆధారంగా సమావేశాల వ్యవధి నిర్ణయించినట్లు, అవసరమైతే మార్పుకు లోబడి ఉంటుందని ఆయన వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..