All-Party Meeting: నేడే ఆల్పార్టీ మీటింగ్.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవేనా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 13వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి ముందు రోజులు ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొననున్నాయి. అయితే ఈ మీటింగ్ సందర్భంగా ప్రతిపక్షాలు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం

దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆఖిలపక్షమ సమావేశం నిర్వహించేందుకు సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం. అటు ప్రతిపక్షాలు సైతం ఈ సమావేశంలో కీలక విషయాలను ప్రస్థావించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఈ సంఘటనకు వ్యతిరేకంగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నీరాహార దీక్ష, ఆయన్న బలవంతంగా హాస్పిటల్కు తరలించే అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
దీనితో పాటు అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్గా మారనుంది. ఈ అంశంపై సమాజ్వాదీ పార్టీ (SP) ఇప్పటికే స్పందిస్తూ, రామాలయ విరాళాల అవకతవకలపై పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ల సమక్షంలో జరగనున్న ఈ సమావేశంలో ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లులు ఇవే:
- అయితే ఈ వర్షాకాల సమావేశాల్లోల కొన్ని ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. కాబట్టి ఆ బిల్లులు ఏంటనేది చూద్దాం.
- జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు, 2026: వందేమాతరం ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే కఠిన శిక్షలు విధించేలా 1971 నాటి చట్టాన్ని ఈ బిల్లు సవరిస్తుంది.
- జనన, మరణాల నమోదు సవరణ బిల్లు, 2026: ఆలస్యంగా నమోదు చేసే జనన, మరణాల ప్రక్రియపై కఠిన నిబంధనలను తీసుకువస్తారు.
- ఆదాయపు పన్ను సవరణ బిల్లు, 2026: ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చే ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తెస్తున్నారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, 2026: సి.జె.ఐ (CJI) తో కలిపి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుండి 38కి పెంచే ప్రతిపాదన ఇందులో ఉంది.
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026: MSME రంగాన్ని బలోపేతం చేయడం, పునర్వ్యవస్థీకరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
