ISI: భారత్ లో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ కుట్ర.. రైల్వే ట్రాకులు పేల్చేందుకు మాస్టర్ ప్లాన్

దేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ రచించాయని తెలిపింది. పంజాబ్‌ సహా పొరుగు....

ISI: భారత్ లో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ కుట్ర.. రైల్వే ట్రాకులు పేల్చేందుకు మాస్టర్ ప్లాన్
Track
Follow us

|

Updated on: May 23, 2022 | 4:54 PM

దేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ రచించాయని తెలిపింది. పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని వివరించాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్‌ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

ఉగ్ర కుట్ర జరుగుతుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

iPhone WhatsApp: ఐఫోన్‌ యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. ఈ మోడళ్లలో సేవలు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..!

“ఫన్” టాస్టిక్ ఈవెంట్ లో రచ్చ చేసిన విక్టరీ.. వైరల్ అవుతున్న వెంకటేష్ పిక్స్

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..