India Pak War Live: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. భారత ఆర్మీ అలర్ట్!
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఈ మేరకు భారత్ - పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు.

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఈ మేరకు భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.. భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుంచి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ట్రంప్ ప్రకటన ఇదే..
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఇరు దేశాలకు అభినందనలు తెలియజేస్తున్నానన్న అమెరికా అధ్యక్షుడు.. రెండు దేశాలు సమయస్పూర్తితో వ్యవహరించాయని ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. భారత సైన్యం చాలా యాక్టివ్గా ప్రత్యర్థి డ్రోన్లు, రాకెట్లను కూల్చేస్తోంది. జమ్ము నగరం మొత్తం విద్యుత్ అంతరాయం కలిగింది. శత్రు సేనల నుంచి వస్తున్న డ్రోన్లను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో కూల్చేస్తున్నారు. కొన్ని రాకెట్లను కూడా కూల్చేస్తున్నట్లు తెలుస్తోంది.
భారత్పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్పోర్ట్పై రాకెట్తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అమృత్సర్లో బ్లాక్అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్, అఖ్నూర్లో సైరన్లు మోగాయి.
పాకిస్తాన్కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్కోట్ ఎయిర్బేస్ను కూడా పాక్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్ సిస్టమ్తో పాక్ డ్రోన్లను కూల్చివేశారు.
సాంబా సెక్టార్లోనూ పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్ముకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్లో భీకరంగా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్ము వర్సిటీ సమీపంలో 2 డ్రోన్లను భారత్ కూల్చివేసింది.
LIVE NEWS & UPDATES
-
దేశ సేవలో బీఎస్ఎఫ్ ఎస్ఐ మృతి
జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దుపై సీమాంతర కాల్పుల సమయంలో దేశ సేవలో బిఎస్ఎఫ్కు చెందిన ధైర్యవంతుడైన సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము.”
-
మా భూమిని రక్షించుకోవడానికి ఇనుప గోడగా మారుతాంః షాబాజ్ షరీఫ్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం (మే 10, 2025) రాత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాల్పుల విరమణ తర్వాత పౌరులను అభినందించారు. “పాకిస్తాన్ ఆత్మగౌరవం కలిగిన దేశమని స్పష్టం చేశారు. మా గౌరవం, ధైర్యం మా ప్రాణాల కంటే మాకు ముఖ్యమైనవి. ఎవరైనా వారిని సవాలు చేస్తే, మా భూమిని రక్షించుకోవడానికి ఇనుప గోడగా మారుతాము” అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ పై అన్యాయమైన యుద్ధం రుద్దడానికి భారతదేశం పహల్గామ్ సంఘటనను ఒక సాకుగా ఉపయోగించుకుందని మరోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆదేశ ప్రజలకు మరోసారి పచ్చి అబద్ధం చెప్పాడు. భారతదేశం నిరాధారమైన ఆరోపణలను ఎదుర్కొంటూ పాకిస్తాన్ స్వతంత్ర, తటస్థ దర్యాప్తును ప్రతిపాదించిందని, సంయమనం పాటించిందని ఆయన అన్నారు.
-
-
ఆర్మీకి కీలక ఆదేశాలు ఇచ్చిన భారత్
పాకిస్తాన్ కాల్పుల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విరమణ ఒప్పందంద జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత సరిహద్దు వెంబడి, కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదన్నారు. అయితే, తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తోందన్నారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా.. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని విక్రమ్ మిస్రీ సూచించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలు ఇచ్చామని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
-
ఫిరోజ్పూర్లో బ్లాక్అవుట్..!
శ్రీనగర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు పంజాబ్లోని ఫిరోజ్పూర్ విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైంది. పాకిస్తాన్ వైపు నుండి కాల్పులు ఆగిపోయిన తర్వాత శ్రీనగర్ అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా, పంజాబ్లోని ఫిరోజ్పూర్లో విద్యుత్ సరఫరా నిలిపివేచిపోయింది. విద్యుత్ సరఫరా మొదలైంది.
-
కాల్పుల విరమణను తర్వాత షాబాజ్ షరీఫ్ ట్వీట్..!
కాల్పుల విరమణకు సంబంధించి షాబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు. కానీ అతను దానిని పోస్ట్ చేసే సమయానికి కాల్పుల విరమణ విచ్ఛిన్నమైంది. ఈ ప్రాంతంలో శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ ఫలితాన్ని సులభతరం చేసినందుకు పాకిస్తాన్ అమెరికాను అభినందిస్తుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వ ప్రయోజనాల దృష్ట్యా దీనిని అంగీకరించాము. దక్షిణాసియాలో శాంతికి వారి విలువైన కృషికి ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నా సమస్యల పరిష్కారంతోపాటు.. శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం దిశగా కొత్త ప్రారంభం అని పాకిస్తాన్ విశ్వసిస్తుందని షాబాజ్ పేర్కొన్నారు. .
We thank President Trump for his leadership and proactive role for peace in the region .
Pakistan appreciates the United States for facilitating this outcome, which we have accepted in the interest of regional peace and stability.
We also thank Vice President JD Vance and…
— Shehbaz Sharif (@CMShehbaz) May 10, 2025
-
-
‘డ్రోన్లు వచ్చాయి.. కానీ వెనక్కి వెళ్ళాయి’: ఆర్మీ
డ్రోన్లు వచ్చాయని, కానీ వాటిలో చాలా వరకు వెనక్కి వెళ్లిపోయాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. ఉరి, బారాముల్లా లేదా ఉత్తర కాశ్మీర్లో ఎటువంటి షెల్లింగ్, కాల్పులు, డ్రోన్లు కనిపించలేదని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యగా, ఉత్తర కాశ్మీర్లోని అన్ని ప్రదేశాలలో బ్లాక్అవుట్ విధించినట్లు వెల్లడించారు. అమృత్సర్లోని వైమానిక స్థావరంపై ఎటువంటి దాడి జరగలేదని స్థానిక అధికారులు కూడా స్పష్టం చేశారు.
-
సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పాక్కు చైనా అండ
భారతదేశంతో ఉద్రిక్తత మధ్య, చైనా తన సార్వభౌమత్వాన్ని , ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్కు అండగా నిలుస్తుందని చైనా తెలిపింది.
-
ప్రస్తుతానికి పఠానకోట్ ప్రశాంతం
ప్రస్తుతం పఠానకోట్లో శాంతి నెలకొంది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగాయి. పేలుడు శబ్దం లేదు, బ్లాక్అవుట్ మాత్రమే ఉంది. జలంధర్, హోషియార్పూర్, గురుదాస్పూర్, అమృత్సర్లలో కూడా బ్లాక్అవుట్ పాటిస్తున్నారు.
-
ఎల్ఓసీలో ఆగిన కాల్పులు: ఆర్మీ
ఎల్ఓసీ వద్ద ప్రస్తుతం కాల్పులు జరగడం లేదని భారత సైన్యం తెలిపింది. శ్రీనగర్లో ఎటువంటి పేలుడు జరగలేదని వెల్లడించింది. అలాగే విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కూడా జరగలేదన్నారు. డ్రోన్ దాడికి సంబంధించిన కొంత సమయం తర్వాత సమాచారం ఇస్తామని పేర్కొంది.
-
అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన తర్వాత, కేంద్ర హోం కార్యదర్శి, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగింది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని హోం కార్యదర్శి, డైరెక్టర్ ఐబి అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.
-
వరుసగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయ్.. సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్
శ్రీనగర్లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు. ఏం జరుగుతోంది.. ఇది కాల్పుల విరమణ కాదు. అంటూ ట్వీట్ చేశారు.
This is no ceasefire. The air defence units in the middle of Srinagar just opened up. pic.twitter.com/HjRh2V3iNW
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
-
LOCలో కొనసాగుతున్న ఉద్రిక్తత
సీజ్ఫైర్ ప్రకటించిన మూడుగంటల్లోనే మళ్లీ ఉద్రిక్తత
జమ్ము, శ్రీనగర్సహా LOC అంతటా పాక్ కాల్పులు
శ్రీనగర్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన ఆర్మీ
కాల్పులను తిప్పికొట్టాలని BSFకి ఆదేశాలు
ఇంటర్నేషనల్ బోర్డర్లోనూ ఉద్రిక్తత
రాజస్థాన్లోని బార్మర్, జైసల్మేర్లో మళ్లీ బ్లాకౌట్
మరోవైపు సీజ్ఫైర్ ప్రకటన తర్వాత మొదలైన మోదీ హైలెవల్ మీటింగ్
హైలెవల్ మీటింగ్ దృష్టికి సీజ్ఫైర్ ఉల్లంఘన అంశం
పాక్ అభ్యర్థనతో సీజ్ఫైర్కి ఓకే చెప్పిన భారత్
తెగబడితే మాత్రం వదలిలేది లేదని ముందే వార్నింగ్
ప్రస్తుతం కశ్మీర్లోని LOCలో కొనసాగుతున్న ఉద్రిక్తత
#WATCH | A complete blackout has been enforced in Jammu
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/kC9CzwlxSI
— ANI (@ANI) May 10, 2025
-
మూడు గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
ఎల్వోసీలో మళ్లీ కాల్పులు
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా సెక్టార్లలో కాల్పులు
జమ్ముకశ్మీర్లో కొనసాగుతున్న బ్లాక్అవుట్
భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కాల్పులు
ఉదంపూర్, నౌషెరా, పూంఛ్, సుందర్బని, ఆర్నియా, కథువా సెక్టార్లలో కాల్పుల మోత
శ్రీనగర్లో వరుసగా పేలుళ్ల శబ్ధాలు
పేలుళ్ల శబ్దాలు వినిపించాయన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
మూడు గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
-
ప్రధాని మోదీ కీలక భేటీ..
కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ EAM డాక్టర్ ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, NSA అజిత్ దోవల్, CDS, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిణామాలను దోవల్ ప్రధానికి వివరించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. కాల్పుల విరమణ.. నిబంధనల ప్రకారం మాత్రమే కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ NSA దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరికీ స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi holds a meeting with Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS and Chiefs of all three Services, at 7, LKM. pic.twitter.com/Zcx3BWo2cA
— ANI (@ANI) May 10, 2025
-
కాల్పుల విరమణపై స్పందించిన చంద్రబాబు
కాల్పుల విరమణపై స్పందించిన చంద్రబాబు
పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ
ఈనెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయి
ఉగ్రవాదంపై పోరాడుతున్న కేంద్రానికి అండగా ఉండాలి
మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉందాం-చంద్రబాబు
-
కేవలం టెర్రిరస్ట్ స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది
కొద్దిరోజులుగా భారత్పై పాక్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది
ఎస్-400ను ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం
పాక్ జెఎఫ్-17 ఫైటర్స్ ఇండియాపై దాడి చేయలేదు
బ్రహ్మోస్ క్షిపిణులను ధ్వంసం చేశారన్నది కూడా నిజం కాదు
శ్రీనగర్, జమ్ము, పఠాన్కోడ్, భుజ్లోని.. వైమానిక స్థావరాలపై దాడి చేయడం కూడా అవాస్తవమే
ఇందుకు సంబంధించి మేం ఆధారాలను కూడా చూపించాం
మీడియా సమావేశాల్లో పాక్ పూర్తిగా అవాస్తవాలు చెప్పింది
పాక్లోని మత సంస్థలపై భారత్ దాడులు చేయలేదు
కేవలం టెర్రిరస్ట్ స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది
పాక్లోని 4 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది
– వ్యోమికా సింగ్
-
ప్రధాని మోదీతో NSA అజిత్ దోవల్ సమావేశం
కాల్పుల విరమణ అనంతరం కీలక భేటీలు
ప్రధాని మోదీతో NSA అజిత్ దోవల్ సమావేశం
ప్రస్తుత పరిణామాలను ప్రధానికి వివరించిన దోవల్
ఎల్లుండి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు
చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సమాలోచనలు
రేపు మరిన్ని కీలక భేటీలు నిర్వహించే అవకాశం
-
ఉగ్రదాడులను ఉపేక్షించేదిలేదు: భారత్
కాల్పులు విరమణకు ఒప్పుకున్నామన్న భారత్
ఉగ్రవాదులపై పోరు మాత్రం ఆగదన్న భారత్
ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తామన్న భారత్
ఉగ్రదాడులను ఉపేక్షించేదిలేదన్న భారత్
-
రాజీ లేని వైఖరి.. అలాగే కొనసాగుతుంది: ఎస్ జైశంకర్ ట్వీట్
“భారతదేశం – పాకిస్తాన్ ఈరోజు కాల్పులు మరియు సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశం స్థిరంగా దృఢమైన.. రాజీలేని వైఖరిని కొనసాగించింది. ఇది అలాగే కొనసాగుతుంది” అని EAM డాక్టర్ ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు.
-
కాల్పుల విరమణ.. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన..
భారత్ పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు… “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, “Pakistan’s Directors General of Military Operations (DGMO) called Indian DGMO at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air… pic.twitter.com/k3xTTJ9Zxu
— ANI (@ANI) May 10, 2025
-
కాల్పుల విరమణకు అంగీకరించాము – పాక్ ప్రకటన
భారత్ – పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషక్ దర్ వెల్లడించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు.
-
భారత్-పాక్ మధ్య తక్షణ కాల్పుల విరమణ – ట్రంప్ కీలక ప్రకటన
తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు. భారత్, పాక్ వెంటనే కాల్పులు ఆపేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాలు శాంతికి ముందడుగు వేశాయని అభినందించారు.
ట్రంప్ X పోస్ట్
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విమానాశ్రయం పరిధిలో జూన్ 9 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం-సైబరాబాద్ సీపీ
-
ఈ నెల 13 న బీజేపీ భారీ తిరంగా ర్యాలీ
ఈ నెల 13 న బీజేపీ భారీ తిరంగా ర్యాలీ
మేము సైతం దేశం కోసం పేరుతో ర్యాలీ
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ
సైన్యానికి మద్దతుగా భారీ ర్యాలీకి బీజేపీ నిర్ణయం
-
తిరుమలలో ఆపరేషన్ గరుడ పేరుతో మాక్ డ్రిల్
తిరుమలలో ఆపరేషన్ గరుడ పేరుతో మాక్ డ్రిల్ …యాత్ర సదన్ 3 వద్ద ఆపరేషన్ గరుడ ను నిర్వహిస్తున్న బలగాలు. …టీటీడీ విజిలెన్స్, పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా మాక్ డ్రిల్. …ఉగ్రవాదులు చొరబడితే తీసుకోవాల్సిన చర్యలపై భక్తులకు అవగాహన కల్పించిన భద్రతాధికారులు.
-
ఇకపై ఉగ్ర దాడులను యుద్ధంగానే పరిగణిస్తాం: ప్రభుత్వ వర్గాలు
ఇక దేశంలో జరిగే ఉగ్రవాద దాడులను యుద్ధంగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. అలాంటి ఉగ్ర దాడులకు యుద్ధరీతిలో ధీటైన సమాధానం చెబుతామని పాకిస్థాన్కు పరోక్ష హెచ్చరికలు చేసింది భారత్.
-
మురళీ నాయక్ అంత్యక్రియలకు పవన్, నారా లోకేష్, అనిత..
అమరావతి: ఆదివారం జరిగే అమర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత , సత్య కుమార్, కేశవ్, అనగాని. పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలను అధికారిక, సైనిక లాంఛనాలు తో జరపనున్న ప్రభుత్వం.
-
Operation Sindoor: పాక్ సరిహద్దులో రైళ్ల రాకపోకలు రద్దు
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ శనివారం ప్రకటించింది. పాక్ భారత భూభాగంపై మిస్సైల్స్ దాడులు జరుపుతున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
ఆపరేషన్ సింధూర్ లో కరుడుగట్టిన ఉగ్రవాదుల హతం
మే 7వ తేదీన సింధూర ఆపరేషన్లో ఐదుగురు ముఖ్య ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ వర్గాల వెల్లడి
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ చెందిన ఉగ్రవాదులు ఐదుగురు ఉగ్రవాదులు హతం
1.ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ ( అబూ జుందాల్) లష్కరే తోయిబాతో అనుబంధం
2.హఫీజ్ ముహమ్మద్ జమీల్. జైష్-ఏ-మహమ్మద్
3 మొహమ్మద్ యూసుఫ్ అజార్ @ ఉస్తాద్ జీ @ మొహమ్మద్ సలీమ్ @ ఘోసి సహబ్. జైష్-ఏ-మహమ్మద్
4. ఖలీద్ @ అబూ ఆకాషా, లష్కరే తోయిబా
5. మొహమ్మద్ హసన్ ఖాన్, జైష్-ఎ-మహమ్మద్
హతమైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దర ఉగ్రవాదులు జైషే ఎ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు
మే 7వ తేదీ దాడిలో తన కుటుంబ సభ్యులు పది మందిని కోల్పోయినట్లు ఇంతకుముందే చెప్పిన మసూద్ అజహర్
భారత్ పై జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదుల పాత్ర ఉంది. ఆపరేషన్ సింధూర్ లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని అఖిల పక్ష సమావేశంలో వెల్లడించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
-
పాకిస్థాన్పై విరుచుకుపడ్డ అసద్
అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. పాకిస్థాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాక్కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు.. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందన్నారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామన్నారు.
-
బెంగుళూరు ఎయిర్పోర్ట్కు మురళీ నాయక్ భౌతికకాయం
జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ మృతదేహం బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రానికి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాకు మురళీ నాయక్ పార్థీవదేహం చేరుకోనుంది. ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు కోడికొండ చెక్పోస్ట్ వద్ద నుంచి 100 వాహనాలతో ఆర్మీ జవాను మురళి నాయక్ పార్దివదేహంతో ర్యాలీగా కళ్లి తండా వెళ్ళనున్నారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
-
బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక భేటీ
శనివారం రాత్రి గం. 8.20కి బీజేపీ ఎంపీలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు నడ్డా. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్తో తాజా ఉద్రిక్తతలపై ఎంపీలతో నడ్డా చర్చించనున్నారు. ఉద్రిక్తతల వేళ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
-
పాక్ ఆరోపణలు తోసిపుచ్చిన ఆఫ్ఘన్ రక్షణ శాఖ
భారత మిసైల్ దాడులకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం వాడలేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా ఖ్వరజ్మీ స్పష్టంచేశారు. ఈ మేరకు పాకిస్థాన్ తమ దేశంపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పాకిస్థాన్పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టంచేశారు. అఫ్గన్లు ఎప్పుడూ భారత దేశాన్ని పాక్ కంటే ఎక్కువగా విశ్వసిస్తారని పేర్కొన్నారు. పాక్ ప్రయత్నం మరోసారి మాయాజాలమేనని పేర్కొన్నారు.
-
ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో ప్రధాని నరేంద్ర మోదీ శనివారంనాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
-
Operation Sindoor: ఆహార ధాన్యాల కొరత లేదు
భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అవసరమైన మేరకు ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
-
మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్లో టాప్ టెర్రరిస్టులు హతం
మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్లో టాప్ టెర్రరిస్టులు హతం
కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు కేంద్రం ప్రకటన
ముగ్గురు జైషే.. ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ప్రకటించిన భారత్
చనిపోయినవారిలో జైషే హెడ్ మసూద్ అజార్ బంధువులు
హతమైన ఉగ్రవాదుల్లో ముంబై 26/11 దాడుల నిందితుడు
- 1. ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ @ అబూ జుందాల్ (లష్కరే)
- 2. హఫీజ్ మొహ్మద్ జమాల్ (జైషే గ్రూప్) (మసూద్ అజార్ బావమరిది)
- 3. మహ్మద్ యూసుఫ్ అజార్ @ ఉస్తాద్జీ @ ఘౌసిసాబ్ (జైషే గ్రూప్) (మసూద్ అజార్ బావమరిది)
- 4. ఖలీద్ @ అబూ అఖాస (లష్కరే) (అనేక ఉగ్రదాడుల్లో నిందితుడు)
- 5. మహ్మద్ హసన్ఖాన్ (జైషే) (పీవోకేలో జైషే కమాండర్)
-
పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోంది
భారత్పై తాము అనేక దాడులు చేశామంటూ పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. సిర్సాలో ఎయిర్ఫోర్స్ స్టేషన్, అదంపూర్లో ఎస్-400 బేస్, విద్యుత్, సైబర్, మౌలిక వ్యవస్థలను తాము ధ్వంసం చేశామని పాక్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. భారత్ మిస్సైల్స్ ఆఫ్గానిస్తాన్ టార్గెట్ చేశాయనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని వివరించారు.
-
భద్రతా దళాలకు ప్రజలంతా అండగా ఉండాలి- కిషన్ రెడ్డి
భద్రతా దళాలకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సైన్యం కోసం అన్ని ఆలయాల్లో పూజలు చేయాలన్నారు. బషీర్బాగ్లోని ఆలయంలో భారత్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. సైనికులు భారత్ను విజయం వైపు నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
-
ఇక ఆపేద్దాం అంటూ భారత్ ముందు కాళ్లబేరం
— ఇక ఆపేద్దాం అంటూ భారత్ ముందు కాళ్లబేరం — భారత్ దూకుడుతో మారిన సీన్ — ఉద్రిక్తతలు తగ్గించుకుందామని భారత్కు సంకేతాలు — పాక్ మీడియాకు ఇంటర్వ్యూలో విదేశాంగమంత్రి ఇషాక్దార్
-
ఆపరేషన్ సింధూర్పై బ్రీఫింగ్..
దేశంలోని సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ దాడులకు తెగబడుతుందన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పాక్ సేనలు ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్లను భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయన్నారు ఖురేషి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేసింది భారత్ ఆర్మీ. LOC పరిధిలో పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన వీడియోను విడుదల చేశారు.
అటు భారత్లోని ఆర్మీ బేస్లను, s-400 వ్యవస్థలను నిర్వీర్యం చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ప్రకటించింది విదేశాంగ శాఖ. ఉధంపూర్, సిర్సీ, సూరత్ఘర్ ఎయిర్బేస్లు సురక్షితంగా ఉన్నాయని అన్నారు.
-
భారత విదేశాంగ మంత్రితో అమెరికా సెక్రటరీ ఫోన్
– భారత విదేశాంగ మంత్రితో అమెరికా సెక్రటరీ ఫోన్
– పాక్తో యుద్ధపరిణామాలపై మాట్లాడిన మార్కో రుబియో
– భారత్ -పాక్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. మార్గాలను అన్వేషించాలని సూచించిన మార్కో రుబియో
– 2 దేశాలు నేరుగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచన
– భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా.. అమెరికా భారత్-పాక్కి మద్దతిస్తుందని చెప్పిన మార్కో రుబియో
-
ఆపరేషన్ సింధూర్పై బ్రీఫింగ్
— ఆపరేషన్ సింధూర్పై బ్రీఫింగ్
— రక్షణ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రెస్మీట్
– పాక్ దాడులు, భారత్ ఎదురుదాడులపై వివరణ
-
ప్రధాని మోదీ నివాసానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
– ప్రధాని మోదీ నివాసానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్
– ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ
– సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ
-
పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు
— పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు — సత్తాచాటిన S-400 డిఫెన్స్ సిస్టమ్ — ఆకాష్ మిసైల్, L-70, Zu-33, షిల్కా ముందు తేలిపోయిన పాక్
– శ్రీనగర్లో ఉదయం రెండు పేలుళ్లు
– భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయన్న స్థానికులు
– నిన్న రాత్రంతా సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు
— భారత్ దాడులతో పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసం
— పాక్లో 3 ఎయిర్బేస్లపై విరుచుకుపడిన భారత్
— రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి
— చక్వాల్లోని మురిద్ ఎయిర్బేస్ ధ్వంసం
— షార్కోట్లోని రఫీకీ ఎయిర్వేస్పై విరుచుకుపడిన భారత్
— ఇస్లామాబాద్తోపాటుపాటు, లాహోర్, పెషావర్..
— రావల్పిండిలోని ఎయిర్బేస్లను మూసేసిన పాక్
— 4 వైమానిక స్థావరాలతోపాటు, మొత్తం పాక్ గగనతలం క్లోజ్
— మధ్యాహ్నం 12వరకు పాక్ ఎయిర్పోర్టులు మూసివేత
-
పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్
— పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్
— డ్రోన్లను ధ్వంసం చేసిన భారత బలగాలు
— పంజాబ్ అమృత్సర్లో కూలిన డ్రోన్
— ముల్గని పోర్ట్ విలేజ్లో శకలాలను గుర్తించిన ఆర్మీ
– శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసిన భారత్
– ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ కూల్చివేత
– యుద్ధ విమానాలు కూల్చేసమయంలో దూకేసిన పైలట్లు
– శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పాక్ పైలట్లు
– పాక్ పైలట్ల కోసం గాలిస్తున్న భారత భద్రతా బలగాలు
– బారాముల్లా- బుద్గామ్- శ్రీనగర్ మధ్యలో ఈ జెట్స్ను కూల్చేశారు.
-
రాజౌరీలో జనావాసాలు టార్గెట్గా పాక్ క్షిపణి దాడులు
– రాజౌరీలో జనావాసాలు టార్గెట్గా పాక్ క్షిపణి దాడులు
– పలు ఇళ్లు ధ్వంసం.. ఒకరు మృతి.. మరికొందరికి గాయాలు
– డ్రోన్ దాడుల్లో అదనపు డీడీసీ రాజ్కుమార్ తాపా దుర్మరణం
– సంతాపం తెలిపిన సీఎం ఒమర్ అబ్దుల్లా
– నిన్నటి వరకూ తమతో పనిచేసిన అధికారి, నిన్న తన సమీక్షలోనూ పాల్గొన్న అధికారి ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారంటూ ఒమర్ ట్వీట్ చేశారు.
– అటు.. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరీలో ఘటనా స్థలానికి చేరుకున్నాయి అదనపు భద్రతా బలగాలు..
– రాజ్కుమార్ తాపా జమ్ముకాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్కు చెందిన అధికారి
– నిన్న జమ్ముకాశ్మీర్ డిప్యూటీ సీఎంతో కలిసి రాజౌరీ జిల్లాలో సీఎం నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరయ్యారు.
– ఇంతలోనే ఆయన నివాసంపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
-
సబ్జిమండిలో ఒక పాక్ మిసైల్ శకలం లభ్యం
అదే సమయంలో సిర్సాలోని సబ్జిమండిలో ఒక పాక్ మిసైల్ శకలం లభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. అయితే ఈ శకలం ఫతాహ్ మిసైల్దా, కాదా అన్నది సైనిక బలగాలు ధృవీకరించాల్సి ఉంది.
-
పాక్ దాడుల్ని తిప్పికొడుతున్న భారత్ రక్షణవ్యవస్థ
— పాక్ దాడుల్ని తిప్పికొడుతున్న భారత్ రక్షణవ్యవస్థ
— భారత్పైకి ఫతాహ్-2 మిసైల్ను ప్రయోగించిన పాక్
— 400 కి.మీ టార్గెట్లను ఛేదించే ఫతాహ్ మిసైల్
— హర్యానాలోని సిర్సాలో ఫతాహ్ మిసైల్ పేల్చివేత
— గురిచూసి కొట్టిన భారత యాంటీ మిసైల్ వ్యవస్థలు
— గత రాత్రి 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులు
— పాక్కు గట్టిగా సమాధానం చెబుతున్న భారత్
-
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ పోస్టును ధ్వంసం చేసిన భారత్
— పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ పోస్టును ధ్వంసం చేసిన భారత్
— భారత భూభాగంలోకి డ్రోన్లు పంపేందుకు ఉపయోగించే టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ధ్వంసం చేసిన భారత్
— పాకిస్తాన్ ఆర్మీ పోస్టుతో పాటు ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది
— డ్రోన్ దాడులకు దీటుగా భారత సైన్యం బదులిస్తోంది
-
పాక్ ప్రధాని అత్యవసర భేటీ..
— భారత ఎదురుదాడులతో పాక్లో టెన్షన్ పెరిగిపోతోంది.
— భారత్పై అణు యుద్ధం పేరుతో బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్.
— పాక్ ప్రధాని అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు.
— పాక్ నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.
— పాక్ జాతీయ భద్రతను కాపాడేందుకు..
— అణ్వాయుధ బాధ్యత కలిగిన నేషనల్ కమాండ్ అథారిటీ
-
భారత వాయుసేన దాడులతో పాకిస్తాన్లో చమురు సంక్షోభం
భారత వాయుసేన దాడులతో పాకిస్తాన్లో చమురు సంక్షోభం
ఇస్లామాబాద్లో 48 గంటల పాటు పెట్రోల్ బంక్ల మూసివేత
పాక్ ఎయిర్ బేస్లపై భారత దళాలు జరిపిన దాడులతో భారీ ప్రభావం
ఇంధన కొరతతో పాటు దేశవ్యాప్తంగా సంక్షోభ భయం
పెట్రోల్ రేషన్ విధించి జనాలను అప్రమత్తం చేస్తున్న పాక్ ప్రభుత్వం
పాక్ ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం
-
శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసిన భారత్
– శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్స్ కూల్చేసిన భారత్
– ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ కూల్చివేత
– యుద్ధ విమానాలు కూల్చేసమయంలో దూకేసిన పైలట్లు
– శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పాక్ పైలట్లు
– పాక్ పైలట్ల కోసం గాలిస్తున్న భారత భద్రతా బలగాలు
— పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు
— సత్తాచాటిన S-400 డిఫెన్స్ సిస్టమ్
— ఆకాష్ మిసైల్, L-70, Zu-33, షిల్కా ముందు తేలిపోయిన పాక్
-
పాక్ ఫతా-1 క్షిపణిని కూల్చివేసిన భారత్
తెలియని వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఫతా-1 క్షిపణిని పశ్చిమ సెక్టార్లో భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
-
మరిసేపట్లో భారత సైన్యం కీలక ప్రకటన
భారత ప్రభుత్వ విలేకరుల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ మీడియా సమావేశం సౌత్ బ్లాక్ లాన్ సమీపంలో జరుగుతుంది.
-
పఠాన్కోట్ వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్లు
పఠాన్కోట్లోని వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్లు వినిపించాయి. ఉరిలో కూడా పేలుళ్లు సంభవించాయి. తెల్లవారుజామున, పఠాన్కోట్లోని వైమానిక స్థావరం దగ్గర నుండి పేలుళ్ల శబ్దాలు రావడం ప్రారంభించాయి. రాత్రిపూట పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడిని భగ్నం చేశారని భావిస్తున్నారు. అదే సమయంలో, ఉరిలో ఒక పెద్ద డ్రోన్ దాడిని కూడా తిప్పికొట్టారు.
-
నౌషేరాలో షెల్లింగ్ ప్రారంభం
సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో పాకిస్తాన్ నుండి నౌషేరాలో షెల్లింగ్ ప్రారంభమైంది.
-
పెషావర్లో భారీ పేలుడు
పాకిస్తాన్లోని పెషావర్లో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాకిస్తాన్లోని నూర్ ఖాన్, షోర్కోట్, మురిద్ వైమానిక దళ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. అయితే, వైమానిక స్థావరంపై ప్రతీకార చర్యను భారతదేశం ఇంకా ధృవీకరించలేదు.
-
పాకిస్థాన్ గగనతలం మూసివేత
మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తు్న్నట్లు పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ ప్రకటించింది.
-
వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణుల దాడిః పాక్
రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ దాడి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచుతుందని అన్నారు.
-
పాకిస్థాన్లోని ప్రధాన నగరాలే టార్గెట్!
ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్లోని రఫికి ఎయిర్బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
-
ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్పై దాడి
పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో ఇస్లామాబాద్లోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ సమీపంలోని సెరెనా హోటల్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
-
రావల్పిండిలో వరుస పేలుళ్లు
పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు.
-
జలంధర్లో అనుమానాస్పద డ్రోన్..!
పంజాబ్లోని జలంధర్లో అనుమానాస్పద డ్రోన్ గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ విధించిన అధికారులు, దర్యాప్తు చేపట్టారు. ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తోంది. ఇంతలో, పంజాబ్లోని జలంధర్లో అనుమానాస్పద డ్రోన్ కనిపించింది. అంతేకాకుండా, పాకిస్తాన్ సరిహద్దు దాటి భారతదేశంలోని అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది. కానీ భారత సైన్యం వాటన్నింటినీ పూర్తిగా తిప్పికొట్టింది.
-
రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో తుపాకీ చప్పుళ్లు
గుల్లయిన ఇళ్లు, అరచేతుల్లో ప్రాణాలు..
రాజౌరి, పూంఛ్ సెక్టార్లలో తుపాకీ చప్పుళ్లు
యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
చిన్న పిల్లల చేతుల్లో కనిపిస్తున్న బుల్లెట్లు
మెషిన్ గన్లతో విరుచుకుపడుతున్న పాక్ జవాన్లు
బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న సరిహద్దు గ్రామాలు
-
క్వెట్టా-సింధ్ హైవేను స్వాధీనం చేసుకున్న BLA
క్వెట్టా-సింధ్ హైవేను BLA యోధులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాకిస్థాన్ సైన్యం పోస్ట్ వదిలి పారిపోయింది. పాకిస్తాన్-భారతదేశం మధ్య ఉద్రిక్తతల మధ్య, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టడం ప్రారంభించింది. బలూచిస్తాన్లోని ఐదు పాకిస్తాన్ సైనిక పోస్టులను BLA స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు BLA క్వెట్టా-సింధ్ హైవేను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిఎల్ఎ-పాకిస్తాన్ సైన్యం మధ్య దాదాపు 2 గంటల పాటు కాల్పులు జరుగాయి. ఇంతలో, పాకిస్తాన్ సైన్యానికి చెందిన అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్న BLA, నగరం వైపు కవాతు చేయడానికి సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
-
మే 15 వరకు విమానాశ్రయాలు మూసివేత
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు పౌర విమానాల కోసం 32 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ఇందులో శ్రీనగర్, అమృత్సర్ సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని 32 విమానాశ్రయాలు ఉన్నాయి.
జాబితా చూడండి…
STORY | 32 airports shut for civilian flight operations till May 15: DGCA
READ: https://t.co/HlU3molb7M pic.twitter.com/cnVEyih4qe
— Press Trust of India (@PTI_News) May 9, 2025
-
ఎల్వోసీ, ఐబీపై భారీ షెల్లింగ్
పాకిస్తాన్ దాడి తరువాత, భారతదేశం ప్రతీకార చర్య పీవోకేలో కొనసాగుతోంది. ఇంతలో, ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు అవతల నుండి భారీ షెల్లింగ్ జరుగుతోంది. దీనికి భారత సైన్యం, బీఎస్ఎఫ్ ప్రతిస్పందిస్తున్నాయి.
-
పీవోకేలోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు
పాకిస్థాన్ మరోసారి రాత్రి సమయంలో భారత్ లోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి తెగబడుతోంది. భారతదేశం ప్రతీకార చర్య ప్రారంభించింది. పీవోకేలోని అనేక ప్రాంతాలు డ్రోన్ల దాడికి గురయ్యాయి. జలాల్పూర్ జతన్ ప్రాంతంలో కూడా ప్రతీకార చర్య తీసుకున్నారు.
-
డ్రాగన్ కంత్రీ బుద్ధి..!
చైనా తన పౌరులకు కీలక సమాచారం అందించింది. చైనా దేశ పౌరులు భారతదేశం, పాకిస్తాన్, నేపాల్ దేశాలకు ప్రయాణించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని వెనుక చైనా కుతంత్రం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వాతావరణం బాగాలేదని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నట్లు కనిపిస్తుంది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
అమృత్సర్లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు చేసిందంటూ పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశాయి. అయితే, ఆ వీడియో 2024 నాటిదని పేర్కొంటూ PIB ఫ్యాక్ట్ చెక్ ఆ వాదనను తోసిపుచ్చింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
గుజ్రాన్వాలాలో పడిపోయిన భారతీయ UAV డ్రోన్ను పాకిస్తాన్ సైన్యం అడ్డగించిందని పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు చిత్రాలను ప్రసారం చేశాయి. ఇది పూర్తిగా అవాస్తవం. ఈ చిత్రాలు 2022లో ఉక్రెయిన్-రష్యా వివాదం నుంచి వచ్చాయని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
పాకిస్తాన్ భారత రాఫెల్ జెట్లను కూల్చివేసిందని ఆరోపిస్తూ ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో 2019 నాటిదని, జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ సమీపంలో కూలిపోయిన భారత వైమానిక దళం (IAF) Mi-17 V5 హెలికాప్టర్కు సంబంధించిన వీడియోగా PIB ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్లోని బటల్ సెక్టార్లోని పోస్టులపై దాడి చేసి కనీసం 12 మంది భారతీయ సైనికులను చంపిందని పాక్ వీడియోలను ప్రచారం చేస్తోంది. ఈ వీడియో పాతదని మరియు ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఏ కార్యకలాపాలకు సంబంధం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. ఈ చిత్రం ఆగస్టు 2011 నాటిదని తెలిపింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత సైనిక కాలనీని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి చేసిందని ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వాస్తవానికి ఇండోనేషియా నుంచి వచ్చిందని, మే 6, 2025 నాటిదని, ఆపరేషన్ సిందూర్కు ముందు చిత్రీకరించబడిందని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
పాకిస్తాన్లోని అనేక సోషల్ మీడియా ఖాతాలు భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ, “సుదర్శన్ చక్ర”ను పాకిస్తాన్ క్షిపణి ఢీకొట్టిందనే చిత్రాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ చిత్రం 2023 నాటిదని మరియు మాస్కోలోని ఒక సైనిక స్థావరంలో జరిగిన అగ్నిప్రమాదాన్ని చూపిస్తుందని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
పాకిస్తాన్లోని నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టును భారతదేశం లక్ష్యంగా చేసుకుందనే వాదనను సోషల్ మీడియా పోస్ట్లతో పాక్ ప్రచారం చేస్తోంది. అయితే, ఈ వాదన నిరాధారమైనదని PIB ఫ్యాక్ట్ చెక్ ధృవీకరించింది. భారతదేశం ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
జమ్మూ వైమానిక దళ స్థావరంలో అనేక పేలుళ్లు జరిగినట్లు ఆన్లైన్లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. PIB ఫ్యాక్ట్ చెక్ చిత్రాలను సమీక్షించి, అవి ఇటీవలివి కాదని నిర్ధారించింది. అవి వాస్తవానికి ఆగస్టు 2021లో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుడుకు సంబంధించినవి.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో ఫేస్ బుక్లో ఓ పోస్ట్ హల్చల్ చేస్తోంది. PIB ఫ్యాక్ట్ చెక్ ఈ పోస్ట్ను నకిలీదిగా గుర్తించి, ఆ ఖాతా నిజమైనది కాదని పేర్కొంది. అజిత్ దోవల్కు ఫేస్బుక్లో అధికారిక అకౌంట్ లేదని స్పష్టం చేసింది
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
సైన్యం సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ వీకే నారాయన్ పంపిన ఓ కాన్ఫిడెన్షియల్ లెటర్ బయటకు వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. జనరల్ వీకే. నారాయన్ అసలు ఆర్మీ చీఫే కాదు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
యుద్ధవాతావరణం నేపథ్యంలో ఇండియాలోని అన్ని ఎయిర్పోర్టులు మూసేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టు కూడా పూర్తిగా అబద్ధమే. ఇండియాలో అన్ని ఎయిర్పోర్ట్ల్లో విమాన రాకపోకలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.
-
జమ్ము టార్గెట్గా డ్రోన్లు ప్రయోగిస్తున్న పాక్
సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తుంది. పంజాబ్లోని పఠాన్కోట్లోని పంట పొలాల్లో పాక్ డ్రోన్ కూలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్ నుంచి తమ పౌరులపైనే భారత్ దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. భారత్ ఎదురుదాడిని తట్టుకోలేని పాక్.. ఇలాంటి తప్పుడు పోస్టులు సృష్టిస్తోంది.
-
జనావాసాలపై పాకిస్తాన్ దాడులు
జనావాసాలపై పాకిస్తాన్ దాడులు
ఒక్కొటొక్కటిగా బయటికొస్తున్న వీడియోలు
పెద్ద ఎత్తున ఇళ్లు, వాహనాలు ధ్వంసం
సైనిక స్థావరాలే టార్గెట్గా పాక్ దాడులు
36 ప్రాంతాలపై డ్రోన్ ఎటాక్స్ చేసిందన్న సోఫియా
పాక్ తన ఎయిర్స్పేస్ను మూసివేయలేదన్న వ్యోమిక
జైషే మహ్మద్ చొరబాటుదారుల హతం
సాంబా సెక్టార్లో చొరబాటుకు ఏడుగురి యత్నం —
కాల్పులు జరిపిన BSF జవాన్లు
యూకే విదేశాంగ కార్యదర్శికి జైశంకర్ ఫోన్
యుఎస్ సెక్రటరీతోనూ మాట్లాడిన కేంద్రమంత్రి
పాకిస్తాన్ దుశ్చర్యల్ని వివరించిన జైశంకర్
సింధూ వివాదంతో సంబంధం లేదు
ఒప్పందం రద్దుపై జోక్యం చేసుకోలేమన్న ప్రపంచబ్యాంకు
పాకిస్తాన్కు షాకిచ్చిన బంగా
చైనా ఆయుధాలతో పాకిస్తాన్కు షాక్
పేలకుండానే కిందపడిపోయిన పీఎల్-15 మిసైల్
హోషియార్పూర్లో శకలాలు
-
పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది
పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది
ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని అబద్ధం చెప్పింది
మతం రంగు పూసే ప్రయత్నం చేసిందన్న మిస్రీ
-
ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ
- ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ
- సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రధానికి నివేదన
- సమావేశాలతో కేంద్రమంత్రులు బిజీబిజీ
-
పంజాబ్లోని ఫిరోజ్పూర్పై డ్రోన్ దాడులు
- పంజాబ్లోని ఫిరోజ్పూర్పై డ్రోన్ దాడులు
- జనావాసాలపై పాకిస్తాన్ ఎటాక్
- మహిళకు తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి గాయాలు
-
మళ్లీ కశ్మీర్లో డ్రోన్ దాడులకు యత్నం
మళ్లీ కశ్మీర్లో డ్రోన్ దాడులకు యత్నం
పాక్ డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం
గుజరాత్ వరకూ సరిహద్దుల్లో హై అలర్ట్
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
రాజౌరీలోని భారత్ ఆర్మీ క్యాంప్పై పాక్ ఆత్మాహుతి దాడి చేసిందంటూ మరో పోస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. కానీ ఇది కూడా పూర్తిగా తప్పుడు కథనం.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత్ దాడిని తిప్పికొడుతూ పాకిస్తాన్ దాడి చేసిందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ భారీ ఎక్స్ప్లోజివ్ బ్లాస్ట్ చేసిందంటూ కొందరు పోస్ట్ చేశారు. కానీ అది నిజం కాదు. 2020లో లెబనాన్లోని బీరుట్లో జరిగిన పేలుడికి సంబంధించిన వీడియో ఇది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
పంజాబ్లోని జలంధర్పై పాకిస్తాన్ దాడి చేసిందంటూ ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఇది నిజం కాదు. ఓ పంట పొలంలో వ్యర్థాలను తగలబెడుతున్న వీడియో ఇది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఇండియన్ ఆర్మీ పోస్ట్ను పాక్ ధ్వంసం చేసింది. 50మందికి పైగా భారత్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీ దాడిలో చనిపోయారంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఇండియన్ ఆర్మీ బేస్ మీద ఇంతవరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్ చేయలేదు.
-
శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో డ్రోన్ దాడులు
–దాడులతో రెచ్చిపోతున్న పాకిస్తాన్
–శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో డ్రోన్ దాడులు
–ఏడు పేలుళ్ల శబ్ధాలు వినిపించాయంటున్న స్థానికులు
–డ్రోన్ను పేల్చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత్కు చెందిన సుఖోయ్ 30 ఫైటర్ జెట్ను ముజఫరాబాద్లో కూల్చేసి.. పైలెట్ను ప్రాణాలతో పాక్ ఆధీనంలోకి తీసుకుందంటూ మరో తప్పుడు పోస్ట్ ప్రచారంలో ఉంది. ఇది కూడా పూర్తిగా అవాస్తవం. భారత్ ఫైటర్ జెట్ ఒక్కటి కూడా పాక్కు చిక్కలేదు. ఏ ఒక్క సైనికుడు కూడా పాకిస్తాన్ చెరలో లేరు.
-
పాక్ డ్రోన్ దాడిలో పలువురికి గాయాలు.?
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జనావాసాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. పంజాబ్ ఫిరోజ్పురలో డ్రోన్ దాడిలో ఓ కుటుంబం గాయపడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. సరిహద్దుకు 100కిమీ దూరంలోని హొశియాపుర్లోనూ పేలుడు శబ్దాలు కలకలం రేపాయి. మరోవైపు జలంధర్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.
-
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
జమ్ముకశ్మీర్లో 56 మంది విద్యార్థులు చిక్కుకుపోవడంతో తమిళనాడు సర్కారు అప్రమత్తమైంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత్లో రెండు, మూడు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవనీ.. ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్స్ చేయొద్దనీ.. మరో పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది కూడా పూర్తి అవాస్తవం. ఏటీఎంలు యథావిథిగా పని చేస్తాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లోనూ ఎలాంటి అంతరాయం లేదు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
మూడు ఇండియన్ ఫైటర్ జెట్స్ కూలిపోయినట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది పూర్తిగా అవాస్తవం. 2019లో జరిగిన ఘటనకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేసి.. ఇప్పుడు కూలిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
గుజరాత్లోని హజీరా పోర్ట్ మీద దాడి జరిగింది. ఆ పోర్ట్ పూర్తిగా ధ్వంసమైందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదు. 2021 జులై 7న ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనను హజీరా పోస్ట్ పేరుతో పోస్ట్ చేశారు.
-
పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారత్పై పాకిస్తాన్ మిస్సైల్స్ వర్షం కురిపించిందంటూ ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఓ గేమింగ్ వీడియోను పోస్ట్ చేసి.. భారత్పై భీకర దాడి అంటూ పోస్ట్ చేశారు.
-
భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— భారత్ పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
— చీకటి పడడంతో కాల్పులకు తెగబడుతున్న పాక్
— యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులకు తెగబడుతున్న పాక్ బలగాలు
— జైసల్మేర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్ అవుట్
— పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత బలగాలు
— జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో హై అలర్ట్
-
జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత
జమ్ము కశ్మీర్లో కాల్పుల మోత
డ్రోన్ దాడులకు పాక్ యత్నం
పలు ప్రాంతాల్లో మోగిన సైరన్లు
సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్ల కూల్చివేత
జమ్మూలో డ్రోన్ పేల్చివేసిన భారత సైన్యం
పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయన్న ఒమర్ అబ్దుల్లా
-
భారత్ – పాక్ దాడులపై విపరీతంగా తప్పుడు ప్రచారం
ఆపరేషన్ సింధూర్తో చావుదెబ్బతిన్నపాకిస్తాన్ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తోంది. పాకిస్తానన్లోని అధికారిక ఖాతాల నుంచి భారత్లోని సైనిక స్థావరాలపై చాలా చోట్లు దాడి చేసినట్లు నకిలీ వీడియోలు, ఫేక్ఫోటోలతో ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తోంది. పాక్ ఫేక్ ప్రచారానికి PIB ఫ్యాక్ట్స్తో చెక్ పెట్టింది.
-
పాక్ మాటలన్ని అబద్దం
ప్రార్థన మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్దమని, ప్రతి విషయంలో పాక్ అబద్దాలకు పాల్పడుతోందని విదేశాఖ శాఖ తెలిపింది. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోందన్నారు.
-
పాక్ తీవ్ర తప్పుడు ప్రచారం
మతం రంగు పూసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిలయత్నాలు చేస్తోందన్నారు. కర్తార్పూర్ కారిడార్ మూసేశామని తెలిపింది. పాక్ తీవ్రంగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
-
పాక్ తప్పుడు ప్రచారం
ఎయిర్స్సేస్ మూసివేశామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. ఎల్ఓసీ వెంబడి నిరంతరం పాక్ కాల్పులు జరుపుతోందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. డ్రోన్ శిథిలాల పరిశీలన జరుగుతోందని, ఆ డ్రోన్లు టర్కీకి చెందిన సోన్గార్డ్వని తెలుస్తోందని అన్నారు.
-
పాక్ దాడులకు తిప్పికొడుతున్న భారత్
పాక్ భటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించిందని విదేశాఖ శాఖ తెలిపింది. పాక్ జరిపిన దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని, దీంతో పాకిస్తాన్కు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. కరాచీ-లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయని, భారత్ వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోందన్నారు.
-
పాక్కు తీవ్ర నష్టం
భారత సైనిక స్థావరాలపై పాక్ దాడికి యత్నిస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. కశ్మీర్లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందన్నారు. భారత్ జరిపిన దాడిలో పాక్కు తీవ్ర నష్టం కలిగిందన్నారు. పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకుని దాడి చేస్తోందన్నారు.
-
పాక్ దాడులు
కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో భారత్ తిప్పుకొట్టిందని, పశ్చిమ సరిహద్దు ప్రాంతాంలో పాక్ దాడులకు పాల్పడుతోందని విదేశాఖ శాఖ వెల్లడించింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని తెలిపింది.
-
కీలక సమావేశం
పాక్- భారత్ యుద్ధం నేపథ్యంలో విదేశాంగ శాఖ కీలక ప్రెస్మిట్ ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన కీలక అప్డేట్ వెల్లడిస్తున్నారు అధికారులు.
-
ఏడుగురిని హతమార్చిన BSF జవాన్లు
పాక్-భారత్ యుద్ధం నేపథ్యంలో భారత బీఎస్ఎప్ జవాన్లు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. భారత్పై 500 డ్రోన్లు ప్రయోగించిన పాక్.. టార్గెట్కు చేరుకోలేక కుదేలైపోయాయి. సియాచిన్ నుంచి భుజ్ వరకు దాడులకు ప్రయత్నించింది. పాక్తో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో బ్లాక్ఔట్ ప్రకటించింది భారత్.
-
ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షలు
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షలు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. త్రివిధదళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ చర్చలు కొనసాగిస్తున్నారు. భారత్లోకి పాక్ చొరబాటుదారులు చొచ్చుకువచ్చేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తున్నారు.
-
సరిహద్దు ప్రాంతాల టార్గెట్గా పాక్ దాడులు
భారత్-పాక్ వార్ కొనసాగుతోంది. సరిహద్దులో ఉండే ప్రాంతాల టార్గె్ట్గా పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లను ప్రయోగించడంతో భారత్ వాటిని గగనతలంలోనే పేల్చివేసింది.
-
బ్లాక్ఔట్
రాత్రిపూట దాడులకు పాక్ తెగబడుతుండటంతో హర్యానాలోని అంబాలాలో పూర్తి బ్లాక్ఔట్ పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి లైట్లు వెలిగించరాదని హెచ్చరించింది.
-
ఎయిర్ రైడ్ సైరన్
ఢిల్లీలోని PWD ప్రధాన కార్యాలయంపై ఎయిర్ రైడ్ సైరన్ ఏర్పాటు చేశారు. దాన్ని టెస్ట్ కూడా చేశారు. వాటి పనితీరును ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ పరిశీలించారు. ఇలాంటి సైరన్లు ఢిల్లీ వ్యాప్తంగా మరో 50 ఏర్పాటు చేయనున్నారు. ఈ సైరన్ మోత దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది.
-
పాక్- భారత్ వార్పై చంద్రబాబు ఏమన్నారంటే..
దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులకు స్థానం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టుబెట్టారని, పాకిస్తాన్ దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకి ఉందన్నారు చంద్రబాబు.
-
సరిహద్దు రాష్ట్రాలే టార్గెట్గా పాక్ దాడులు
భారత్- పాకిస్తాన్ వార్ నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలే టార్గె్ట్గా దాడులకు తెగబడుతోంది. పాక్ దాడులతో రాజౌరీ భారీగా నష్టపోయింది. వాహనాలు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. రాజౌరీ నుంచి వెళ్తున్న వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
-
ఏటీఎంల బంద్పై కేంద్ర క్లారిటీ
భారత్ – పాకిస్తాన్ ఉద్రక్తతల కారణంగా రకరకాల వదంతులు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. 2-3 రోజుల పాటు ఏటీఎంలు బంద్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఫేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచన చేసింది.
-
ఆయిల్ కంపెనీల కీలక ప్రకటన
భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల నడుమ ఇండియన్ ఆయిల్ కీలక ప్రకటన. యుద్ధభయంతో ఎవరూ పెట్రోల్ కోసం పరుగులు తీయొద్దని సూచన చేసింది. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయిల్ కంపెనీలు సూచించాయి.
-
విమాన ప్రయాణికులకు హెచ్చరిక
పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత విమానయాన సంస్థలు ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేశాయి. భద్రతా కారణాల రీత్యా ప్రయాణీకులు చెక్ ఇన్ కోసం మూడు గంటలు ముందుగానే ఎయిర్ పోర్ట్కు చేరుకోవాలని ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
-
ఆర్మీ చీఫ్కు స్పెషల్ పవర్స్
బోర్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం స్పెషల్ పవర్స్ ఇచ్చింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రెగ్యులర్ ఆర్మీకి సాయంగా తీసుకునే అధికారాన్ని సైన్యాధిపతికి కల్పించింది. ఈ ఉద్రిక్త సమయంలో టెరిటోరియల్ సైన్యంలోని ఏ అధికారి, ఉద్యోగి సేవలనైనా వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్కు అనుమతులు జారీ చేసింది.
-
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
ఆపరేషన్ సింధూర్తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాక్ దాడులను భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దు రాష్ట్రాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాలోని పోలీస్, ప్రభుత్వ, వైద్య అధికారుల సెలవులు రద్దు చేశారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
పాక్ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో పూర్తిగా యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్ము, రాజౌరీ, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. అక్కడ ప్రత్యేక నిఘా, బ్లాకౌట్లు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గుర్దాస్పూర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
– పాక్ దాడులతో యూరీ భారీగా నష్టపోయింది. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు, దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. స్కూళ్లు బంద్ అయ్యాయి. యూరీ నుంచి వెళ్తున్న, వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా బలగాలు
-
యుద్ధభూమిలో తెలుగు జవాన్ వీర మరణం
India-Pakistan War Updates: జమ్ము కశ్మీర్లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వీరజవాన్ ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పుల్లో గోరంట్ల మండలం తల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందాడు. మురళీ నాయక్ స్వస్థలం గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయితీ కల్లి తండా. యుద్ధభూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మురళీ నాయక్ డెడ్బాడీ శనివారం స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది
-
ఐపీఎల్ నిరవధిక వాయిదా
India-Pakistan News LIVE: పహల్గామ్ లో ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. నేపథ్యంలో ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్ల భద్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
-
పాకిస్థాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొన్న ఆకాశ్ క్షిపణి వ్యవస్థ
india attack on pakistan: భారత ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్లు భారత ఆర్మీ ట్వీట్ చేసింది. భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులకు దిగినట్లు తెలిపింది. డ్రోన్లు, ఇతర పరికరాలతో పాక్ దాడులకు దిగినట్లు ఆర్మీ ట్వీట్ చేసింది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతోందని పేర్కొంది. దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
-
భారత్, పాక్ ఉద్రిక్తతలపై స్పందించిన చైనా
India-Pakistan War Updates– భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది — రెండూ ఒకరికొకరు పొరుగు దేశాలు, ఆ ఇద్దరూ చైనాకు పొరుగువారంటూ చైనా ప్రకటించింది — ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది — విస్తృత ప్రయోజనాల కోసం శాంతి మార్గం అనుసరించాలని సూచించింది — UN చార్టర్ సహా అంతర్జాతీయ చట్టాన్ని పాటించాలని వివరించింది — ఇరుదేశాలు ప్రశాంతంగా ఉండాలి, సంయమనం పాటించాలని చైనా సూచించింది — పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు దూరంగా ఉండాలంటోంది — ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి, నిర్మాణాత్మక పాత్ర పోషించానికి, అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది.
-
చండీగఢ్లో మోగిన సైరన్లు
India-Pakistan News LIVE: చండీగఢ్లో దాడులు జరగవచ్చని ఎయిర్ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని.. బాల్కనీల్లోకి కూడా రావొద్దని సూచించింది.జమ్ములోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చిన దుశ్చర్యకు ప్రతిగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ గట్టి ఎదురుదెబ్బ తీసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి
-
త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సమావేశం
India-Pakistan War News LIVE: త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సమావేశమయ్యారు. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు.
-
50 పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
India-Pakistan War Updates: ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లకు భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉధంపూర్, జమ్ము, నగ్రోటా, అఖ్నూర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా, వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేవేసింది.
-
పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్
India-Pakistan War News LIVE: పాకిస్తాన్లో 7 కీలక ప్రాంతాలపై దాడులకు దిగింది భారత్. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్గా ప్రత్యేక వ్యూహంతో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును తాకాయి. కరాచీని ప్రత్యేకంగా టార్గెట్గా చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్ నేవీ ప్రధాన కార్యాలయం కరాచీలోనే ఉంది. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన సీ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. అందుకే పాకిస్తాన్కు గుండెకాయ లాంటి ప్రాంతాలను భారత్ టార్గెట్ చేసింది.
ఇప్పుడే కాదు 1971లోనూ కరాచీ టార్గెట్గా దాడులు జరిగాయి. 1971 డిసెంబర్ 4న అత్యంత సాహాసోపేతమైన దాడులకు దిగింది భారత్, దీన్ని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. అప్పట్లో INS నిపట్, INS నిర్ఘాత్ క్షిపణి పడవలను ఉపయోగించి చమురు నిల్వలపై దాడులు చేసింది భారత్. ఈ క్రమంలోనే డిసెంబర్ 4న నేవీ డేగా జరుపుతుంది భారత్. 1971 తర్వాత కరాచీపై భారత్ మళ్లీ ఇప్పుడే దాడి చేసింది.
-
భారత్, పాక్ మధ్య తాజా పరిస్థితులు దిగువ వీడియోలో చూడండి
-
పాక్ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన భారత్
పాక్ దాడులు చేస్తోంది.. భారత్ అంతకు మించిన వేగంతో తిప్పికొడుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. వాస్తవ పరిస్థితులు ఏంటనే దానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో -PIB క్లారిటీ ఇస్తోంది. గుజరాత్ హజీరా పోర్ట్పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తప్పుడు సమాచారం అని PIB ప్రకటించింది. అది 2021 జులై 7న జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియో అంటూ PIB వివరించింది. సో హజీరా పోర్ట్పై దాడి జరిగలేదని PIB స్పష్టం చేసింది.
-
భారత్, పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన
India-Pakistan News LIVE: పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికాఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలనే అమెరికా కోరుకుంటోందన్నారు. మనం చేయగలిగేది ఏమిటంటే, ఈ దేశాలు ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ప్రోత్సహించడం. కానీ మనం వాళ్ల మధ్యలో జోక్యం చేసుకోబోము. ఇది ప్రాథమికంగా మన వ్యవహారం కాదు, దీన్ని అదుపు చేయడంలో అమెరికా పాత్ర ఏమీ లేదు అని జేడీ వాన్స్ ఫాక్స్ న్యూస్తో చెప్పారు.
-
పాక్కు కాళరాత్రిని మిగిల్చిన భారత్
భారత్పై దాడులకు యత్నించిన పాక్కు కాళరాత్రే ఎదురయింది. పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలను భారత్ నేలమట్టం చేసింది. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను భారత్ నేలకూల్చింది. భారత్వైపు ఎలాంటి నష్టం జరగలేదని రక్షణశాఖ వెల్లడించింది. పాక్ దాడులకు భారత్ అంతే తీవ్రంగా స్పందించింది. భీకరమైన ఎదురుదాడులకు దిగింది పాక్లోని మరో రెండు వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. పంజాబ్ ప్రావిన్సులోని గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అవాక్స్ను ధ్వసం చేసింది.
-
భారత్కు స్పష్టంగా మద్దతు ఇవ్వాలి: పెంటగాన్ మాజీ అధికారి
భారతదేశానికి స్పష్టంగా మద్దతు ఇవ్వాలి: పెంటగాన్ మాజీ అధికారి
పాకిస్తాన్తో ఉద్రిక్తతలపై అమెరికా భారతదేశానికి స్పష్టంగా మద్దతు ఇవ్వాలని పెంటగాన్ మాజీ అధికారి, అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ అన్నారు. లష్కరే తోయిబా వంటి వ్యక్తిగత ఉగ్రవాద సంస్థలను అమెరికా గతంలో గుర్తించిందని, కానీ పాకిస్తాన్ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా ప్రకటించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అమెరికా భారతదేశానికి మద్దతు ఇవ్వాలి. ఏ ప్రజాస్వామ్య నాయకుడి పని అయినా తన పౌరులను రక్షించడమే అని మైఖేల్ రూబిన్ స్పష్టం చేశారు.
-
DRDO అత్యవసర సమావేశం
DRDO అత్యవసర సమావేశం
పాకిస్తాన్తో ఉద్రిక్తతల మధ్య రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో పాటు, చాందీపూర్ క్షిపణి శ్రేణి భద్రతను కూడా పెంచారు. ఇక్కడ నాలుగు స్థాయిల భద్రతను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట, ఒడిశా పోలీసులను మోహరించారు. తరువాత సైన్యం, తరువాత DRDO సొంత భద్రతా బృందం, చివరకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) నాల్గవ స్థాయి భద్రతను అందిస్తున్నారు.
-
ఇద్దరి మధ్య చర్చలు జరగాలిః టర్కీ అధ్యక్షుడు
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చలు జరగాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ అన్నారు. భారతదేశం – పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి క్షిపణి దాడులలో అనేక మంది పౌరులు మరణించిన తరువాత సంభావ్య సంఘర్షణ గురించి హెచ్చరించారు. “ప్రాణాలు కోల్పోయిన మా సోదరుల కోసం అల్లాహ్ దయ కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని చెబుతూ ఆయన పాకిస్తాన్కు సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ దాడిపై అంతర్జాతీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనకు ఎర్డోగన్ మద్దతు ఇచ్చారు.
-
యుద్ధం మధ్యలో మేము పాల్గొనబోంః జెడి వాన్స్
ప్రస్తుతం జరుగుతున్న భారత్-పాకిస్తాన్ వివాదం ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు అని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అన్నారు. ఈ పరిస్థితిపై అమెరికాకు పరిమిత నియంత్రణ మాత్రమే ఉందని అన్నారు. “మనం చేయగలిగేది ఏమిటంటే, ఇద్దరిని సంయమనం పాటించాలని సూచించడమే అన్నారు. కానీ ప్రాథమికంగా అమెరికాకు సంబంధం లేనిదన్నారు. అమెరికా నియంత్రించే సామర్థ్యంతో సంబంధం లేని యుద్ధం మధ్యలో మేము పాల్గొనబోమని వాన్స్ స్పష్టం చేశారు.
ఈ సమయంలో భారతీయులను ఆయుధాలు వదులుకోమని అమెరికా చెప్పలేదు. పాకిస్తానీలను ఆయుధాలు వదులుకోమని మేము చెప్పలేం. కాబట్టి, దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తామన్నారు జేడీ వాన్స్. ఇది విస్తృత ప్రాంతీయ యుద్ధంగా, అణు సంఘర్షణగా మారకూడదని మా ఆశ. ప్రస్తుతానికి, అది జరగబోదని అనుకుంటున్నామని అమెరికా ఉపాధ్యాక్షులు జేడీ వాన్స్ అన్నారు.
-
బహవల్నగర్ కంటోన్మెంట్ సమీపంలో పేలుళ్లు, కాల్పులు
బహవల్నగర్ కంటోన్మెంట్ సమీపంలో పెద్ద ఎత్తున పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. సైరన్లు మోగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మసీదుల వద్ద ఇళ్లలోని లైట్లు ఆపివేయమని ప్రకటనలు వచ్చాయి. అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
-
చాంబ్, సియాల్కోట్లలో అత్యవసర పరిస్థితి
పాకిస్తాన్లోని చాంబ్, సియాల్కోట్ సెక్టార్లలో అత్యవసర పరిస్థితి లాంటి పరిస్థితి తలెత్తింది. ఈ ప్రాంత ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. పాకిస్తాన్లోని చాంబ్ సెక్టార్ జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్కు ఎదురుగా ఉంది. ఇది నియంత్రణ రేఖపై ఉంది. అదే సమయంలో, పాకిస్తాన్లోని సియాల్కోట్ సెక్టార్ కూడా అఖ్నూర్ సెక్టార్కు ఆనుకొని ఉంది. ఇది అంతర్జాతీయ సరిహద్దులో వస్తుంది.
-
ఇప్పటివరకు 10 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడిన జైశంకర్
ఆపరేషన్ సిందూర్ తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటివరకు 10 మంది విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి MBA అల్ థాని జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయాతో మాట్లాడారు. దీనితో పాటు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఢిల్లీలో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్, జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్, స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెజ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చితో సమావేశమై మాట్లాడారు. అదే సమయంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధితో మాట్లాడారు. భారతదేశం ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రితో మాట్లాడారు.
-
ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్
పాకిస్తాన్ దాడిపై శుక్రవారం ఉదయం 10 గంటలకు సైన్యం, విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశం నిర్వహించనున్నాయి.
-
ISI కార్యాలయంపై దాడి
ISI కార్యాలయం నుండి పెద్ద వార్త వచ్చింది. లాహోర్లోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై భారతదేశం దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
-
కరాచీలో ల్యాండైన టర్కిష్ కార్గో విమానం
పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయంలో టర్కిష్ కార్గో విమానం ల్యాండ్ అయింది. జమ్మూలో డ్రోన్ దాడి తర్వాత, ఈ కార్గో విమానంలో టర్కిష్ డ్రోన్లు ఉండవచ్చని భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కరాచీ విమానాశ్రయంలో టర్కిష్ కార్గో విమానం ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.
-
సాంబా సెక్టార్లో జైషే ఉగ్రవాదులు హతం
జమ్మూలోని సాంబా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని బిఎస్ఎఫ్ భగ్నం చేసింది. బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సమాచారం ప్రకారం, 10 నుండి 12 మంది జైషే ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు.
-
సంయమనం పాటించి,ఉద్రిక్తతలను తగ్గించాలిః యూఎన్
భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమోన్ యాంగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని, వెంటనే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. పౌరులు, మౌలిక సదుపాయాలపై జరిగిన అన్ని ఉగ్రవాద దాడులు, హింసను ఆయన ఖండించారు.
“ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంభాషణలు, దౌత్య పరిష్కారాలు మాత్రమే విభేదాలను పరిష్కరించడానికి, శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి ఏకైక మార్గాలని గట్టిగా నమ్ముతున్నాను” అని యాంగ్ అన్నారు.
-
పారిపోయిన పాకిస్థాన్ సైన్యం
బలూచిస్తాన్లో మూడింట ఒక వంతును స్వాధీనం చేసుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. స్థానిక కథనాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ భూభాగాలకు ఆనుకుని ఉన్న పాకిస్తాన్ పోస్టులను వదిలి పాకిస్థాన్ సైన్యం పారిపోయిందని బీఎల్ఏ తెలిపింది.
-
2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్
భారత్ దాడులతో పాకిస్తాన్ అల్లాడుతుంది. పాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసింది భారత్. సర్గోధా, ఫైసలాబాద్లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించింది.
-
ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు
పాకిస్తాన్లోని పెషావర్, లాహోర్, కరాచీలో భారత్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుంది. -పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై భారత నేవీ అధికారులు దాడి చేశారు. పాక్కు చెందిన మూడు ఫైటర్ జెట్స్తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశారు.
-
ఎయిర్పోర్టుల దగ్గర హైఅలర్ట్
దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల దగ్గర హైఅలర్ట్ ప్రకటించింది భారత రక్షణశాఖ . ఎయిర్పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించింది.
-
సరిహద్దు ప్రాంతాల్లో మోగుతున్న సైరన్లు
భారత్పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్పోర్ట్పై రాకెట్తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అమృత్సర్లో బ్లాక్అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్, అఖ్నూర్లో సైరన్లు మోగాయి.
-
పీవోకేలో భీకర ఎదురుదాడి
పీవోకేలో భారతదేశం భారీ ప్రతీకార దాడిని ప్రారంభించింది. ఫిరంగి నుండి గుండ్లు దూసుకుపోతున్నాయి. అంతే కాకుండా, డ్రోన్లను ఉపయోగించి ఎదురుదాడి కూడా జరుగుతోంది. భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్లో భయానక వాతావరణం నెలకొంది.
-
నౌషేరాలో పాక్ డ్రోన్ల కూల్చివేత
జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో రెండు పాకిస్తాన్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. ఆ సెక్టార్లో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.
-
ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణం
ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణ సలహా జారీ చేసింది. విమానాల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. మారుతున్న గగనతల పరిస్థితులు, గట్టి భద్రత కారణంగా కొన్ని విమానాలు ప్రభావితమయ్యాయి. ప్రయాణీకుల సమాచారం కోసం వారి విమానయాన సంస్థను సంప్రదించాలని సూచించారు.
-
శాంతియుత పరిష్కారమే మార్గంః అమెరికా
జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లలో భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ అనేక డ్రోన్,క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతోందని, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు శాంతియుత పరిష్కారం కోసం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
-
సాంబా సెక్టార్లో పాక్ కాల్పులు
జమ్మూలోని సాంబా సెక్టార్లో పాకిస్తాన్ వైపు నుండి భారీ కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యానికి బిఎస్ఎఫ్ సైనికులు తగిన సమాధానం ఇస్తున్నారు. షకార్గ్, సియాల్కోట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బిఎస్ఎఫ్ కాల్పులు జరుపుతోంది.
-
బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. తరువాత అనేక పేలుళ్లు జరిగాయి.
-
ఇండియా గేట్ ఖాళీ చేయించిన అధికారులు
పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. దీని వలన సరిహద్దు అంతటా భయాందోళనలు, గందరగోళం నెలకొంది. భారతదేశం తన దేశ అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల కోసం కూడా బలమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. ఇండియా గేట్ చుట్టూ ఎవరూ ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపట్టింది.
-
యూరీలో యుద్ధ వాతావరణం
యూరీలో యుద్ధ వాతావరణం నెలకొంది. బాంబుల మోతలతో యూరీ ప్రాంతం దద్దరిల్లుతోంది. యూరీలో కాల్పులకు తెగబడుతుఉన్న పాకిస్తాన్ను భారత సైన్యం తిప్పికొడుతోంది. కాల్పులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంకర్లలోకి పరుగులు పెడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
-
కరాచీ ఓడరేవులో విధ్వంసం
భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీ ఓడరేవులో 8 నుండి 12 పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత అక్కడ బ్లాక్అవుట్ విధించారు. మొబైల్ సిగ్నల్ కూడా అంతరాయం కలిగింది.
-
మెంధార్ సెక్టార్లో బరితెగించిన పాక్
మెంధార్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని మెంధార్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.
-
కరాచీలో అర్డర్ కోసం ఎదురుచూస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్
పశ్చిమ నావల్ కమాండ్ రంగంలోకి దిగింది. కరాచీ సమీపంలో INS విక్రాంత్, కోల్కతా తరగతి డిస్ట్రాయర్లు యుద్ధనౌకలలో సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర వ్యవస్థ నుండి అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్షణానైనా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలుస్తోంది.
-
8 వేలకు పైగా X ఖాతాలు బ్లాక్
భారతదేశం గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ట్విట్టర్ (X) ఖాతాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. భారత ప్రభుత్వం ఎనిమిది వేలకు పైగా ట్విట్టర్ ఖాతాలను మూసివేయాలని ఆదేశించింది.
-
దేశంలోని 27 విమానాశ్రయాలు మూసివేత
పాకిస్తాన్ దాడి ప్రయత్నాలు విఫలమవడంతో భారతదేశంలోని 27 విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా , సిమ్లా, కులు ఉన్నాయి.
-
పాకిస్తాన్ పైలట్ పట్టివేత
పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది భారత్. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాకిస్థాన్కు చెందిన F- 16 పైలట్ను భారత్ పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది.
-
పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటన
భారత ప్రతీకార దాడుల్లో రెండు JF-17 యుద్ధ విమానాలు కోల్పోయినట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. భావోద్వేగంగా తీవ్రమైన నష్టం అంటూ పాకిస్తాన్ ప్రకటన చేసింది. ఈ ఘటనలో కొందరు జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ తెలిపింది. తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాక్ ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తోంది.
-
భారత రక్షణ శాఖ కీలక ప్రకటన
జమ్ము, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది. ఈరోజు పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. ఎటువంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.
-
కచ్లో 3 పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్
గుజరాత్లోని కచ్ సరిహద్దులో ఆరు పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. ఈ డ్రోన్లు గత 3 గంటలుగా కనిపిస్తున్నాయి. వీటిలో 3 డ్రోన్లను కూల్చివేసి, మూడు ఇప్పటికీ ఎగురుతున్నాయి.
-
పారామిలిటరీ దళాల డీజీకి అమిత్ షా ఫోన్
పాకిస్తాన్ పై ప్రతీకార చర్య మధ్య, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారామిలిటరీ దళాల డీజీతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.
-
జమ్మూ కాశ్మీర్లో పాఠశాలలు మూసివేత
జమ్మూ కాశ్మీర్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, 12వ తరగతి వరకు పాఠశాలల్లో తరగతులు శుక్రవారం నిలిపివేయడం జరుగుతుందని విద్యా మంత్రి సకినా ఇట్టూ తెలిపారు. కాశ్మీర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (IUST) లో కూడా తరగతులను వాయిదా వేశాయి.
-
పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ధ్వంసం
భారతదేశం ప్రతీకార చర్యతో పాకిస్తాన్ వణికిపోతుంది. అత్యంత నవీకరించిన వైమానిక హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ (AWACS) ను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ నిఘా, యుద్ధ నియంత్రణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.
-
పాకిస్థాన్కు మొదలైన కౌంట్ డౌన్!
పాకిస్తాన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. భారతదేశం ఎదురుదాడిని ప్రారంభించింది. లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, బహవల్పూర్లలో వేగవంతమైన దాడులను భారతీ ఆర్మీ ప్రారంభించింది.
-
జైశంకర్తో మాట్లాడిన ఈయూ
పాకిస్తాన్ దాడుల ప్రయత్నాల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యూరోపియన్ యూనియన్తో ఫోన్లో మాట్లాడారు. భారతదేశం తన చర్యలలో సంయమనం పాటించిందని ఆయన అన్నారు. అయితే, పాకిస్తాన్ వైపు నుండి ఉద్రిక్తత పెరిగితే తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందని జైశంకర్ స్పష్టం చేశారు.
-
వణికిపోతున్న పాకిస్తాన్
భారతదేశం ఎదురుదాడి తర్వాత పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్లలో సైరన్లు మోగుతున్నాయి.
-
రంగంలోకి దిగిన భారత నావికాదళం
పాకిస్తాన్పై భారత సైన్యం ప్రతీకార చర్య తీసుకుంటున్న సమయంలో, భారత నావికాదళం కూడా రంగంలోకి దిగింది. పాకిస్తాన్కు ప్రతిస్పందించడానికి భారత నావికాదళ పశ్చిమ కమాండ్ చేరాలని యోచిస్తోంది.
-
జైశంకర్కు అమెరికా విదేశాంగ మంత్రి
భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన మధ్య, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో మాట్లాడారు. వెంటనే ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. భారత్-పాక్ మధ్య ప్రత్యక్ష సంభాషణకు అమెరికా మద్దతును ఆయన వ్యక్తం చేశారు. కాగా పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని రూబియో ఇదివరకే ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటించారు. కాగా, భారతదేశం తన చర్యలలో సంయమనం పాటించిందని జైశంకర్ అన్నారు. అయితే, పాకిస్తాన్ వైపు నుండి ఉద్రిక్తత పెరిగితే తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందన్నారు.
-
రాజస్థాన్లో పాకిస్తాన్ దాడికి యత్నం
రాజస్థాన్లో దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది. జైసల్మేర్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ 30 పాకిస్తానీ క్షిపణులను కూల్చివేసింది.
-
ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ
పాకిస్తాన్ దుశ్చర్య తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ మధ్య సమావేశం జరుగుతోందని విశ్వనీయవర్గాల సమాచారం.
-
లాహోర్పై భారత్ దాడులు
పాకిస్తాన్ ఇప్పుడు ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే, దానికి తగిన సమాధానం లభిస్తుందని భారతదేశం కొన్ని గంటల క్రితం చెప్పింది. అయినప్పటికీ, పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నించింది. దానిని విఫలమైన తరువాత, భారతదేశం ఇప్పుడు ప్రతీకార చర్యను ప్రారంభించింది. భారతదేశం చర్య తర్వాత లాహోర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
-
రాజ్నాథ్ సింగ్ అత్యవసర భేటీ
మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల మధ్య, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశమైంది. రాజ్నాథ్ సింగ్ తోపాటు CDS, త్రివిధ సైన్యాల అధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నారు.
-
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పాకిస్తాన్ దుష్ట కార్యకలాపాల మధ్య, పంజాబ్ ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజల సౌలభ్యం కోసం 0172-2741803, 0172-2749901 ఫోన్ నంబర్లను జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ నంబర్లను సంప్రదించవచ్చు.
-
పాకిస్తాన్ దాడి విఫలం
జమ్మూ కాశ్మీర్లోని సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియా సెక్టార్లలో పాకిస్తాన్ 8 క్షిపణులను ప్రయోగించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.
-
జమ్మూ పోలీసుల హెచ్చరిక
జమ్మూ పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇంటి లోపల, సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని స్థానికులకు సూచించారు. అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పుకార్లు, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పోలీసులు సూచించారు. ఇది ఆందోళనకు కారణమవుతుందన్నారు.
-
జమ్మూలో పాక్ డ్రోన్ల కూల్చివేత
జమ్మూలోని సత్వారీ విమానాశ్రయం, జమ్మూ విశ్వవిద్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను యాంటీ-డ్రోన్ వ్యవస్థ కూల్చివేసింది.
-
అధికారుల సెలవులు రద్దు
యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అధికారుల సెలవులను రద్దు చేసింది.
-
పాక్ డ్రోన్లను ధ్వంసం చేసిన భారత్
వాయు రక్షణ వ్యవస్థలు, వాయు రక్షణ తుపాకులు అనేక డ్రోన్లను కూల్చివేసాయి. జమ్మూ, జైసల్మేర్, అమృత్సర్లపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది. వాయు రక్షణ వ్యవస్థతో పాటు, వాయు రక్షణ తుపాకులు జమ్మూలో తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్లను కూడా ధ్వంసం చేశాయి.
-
పాకిస్తాన్ ఫ్లాన్ ధ్వంసం
రాజౌరి, పూంచ్ లలో పాకిస్తాన్ ప్రణాళికలు ధ్వంసం చేసిన భారత ఆర్మీ. రాజౌరి, పూంచ్ లపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలను భారతదేశం విఫలం చేసింది.
-
జమ్మూలో దాడికి యత్నించి పాక్
జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని ఆర్ఎస్ పురాలో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది, దీనిని భారతదేశం విఫలం చేసింది.
-
దుష్ట కుట్రలను నాశనం చేసిన సుదర్శన చక్రం
భారతదేశ రక్షణ కవచం S-400 మరోసారి పాకిస్తాన్కు గగనతలంలో గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ కు చెందిన 8 క్షిపణులను వైమానిక రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది.
-
కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు
ఉగ్రవాదం అంతమయ్యే వరకు చర్చల ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది భారత్. అసత్య ప్రచారాలు అసలే నమ్మొద్దని ప్రజలకు సూచించింది. మరోవైపు LOC దగ్గర పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. జమ్ము, కుప్వారా, బారాముల్లా, యురి, పూంచ్, మెందార్, రాజౌరి సెక్టార్లలో పాక్ అమాయక ప్రజలపై కాల్పులకి తెగబడుతోంది. మోర్టార్లు, భారీ శతఘ్నులతో దాడులు చేస్తోంది. దాయాది దాడులు చేస్తున్న క్రమంలోనే భారత్ ప్రతిదాడులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
-
దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్
పాక్ సైనికులు డ్రోన్లు, మిస్సైళ్లతో ఎటాక్ చేశారు. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలతో దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. మిసైల్ శకలాలను స్వాధీనం చేసుకున్నాం. పాకి దాడి చేసిందనడానికి అవే ఆధారం
-
రావల్పిండిపై డ్రోన్ దాడులు
పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం దగ్గర ఓ డ్రోన్ కూలిపోయింది. దీంతో ఓ రెస్టారెంట్తో పాటు స్డేడియం దెబ్బతింది. పాక్ కవ్వింపు చర్యలకి ఆధారాలు ఉన్నాయని.. మళ్లీ రిపీట్ అయితే ప్రతిదాడులు వేరే లెవెల్లో ఉంటాయని హెచ్చరించింది భారత్.
-
10 ప్రాంతాల్లో ఎటాక్
పాక్ దాడులతో భారత్ ప్రతిదాడులు మొదలెట్టింది. మొత్తం 10 ప్రాంతాల్లో ఎటాక్ చేసింది. అటోక్, రావల్పిండి, చక్వల్, గుజ్రన్వాలా, లాహోర్, వాల్టన్, బవహల్పూర్, మెహమూనా, కరాచి, చోర్ ఏరియాల్లో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాయి భారత బలగాలు.
-
గనతంలోనే పేల్చేసిన S-400
శ్రీనగర్, అవంతిపొర, జమ్ము, పటాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, చండీగఢ్, లుథియానా, భటిండా, అదంపుర్, నల్ బికనీర్, ఫలోడి, ఉత్తర్లాయ్, భుజ్ ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది. ఆ దాడుల్ని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ మిసైళ్లను S-400తో గగనతంలోనే పేల్చేశాయి.
-
ప్రధాన నగరాల్లో దాడులకు ప్లాన్
పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. దీనికి కడుపుమంటతో రగిలిపోయిన దాయాది.. భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్లాన్ చేసింది.
-
సైనిక స్థావరాలే టార్గెట్గా పాక్ దాడులు
యుద్ధం వద్దని భారత్ సంయమనం పాటిస్తుంటే.. దాయాది పాక్ సైనిక స్థావరాలే టార్గెట్గా దాడులకి ప్లాన్ చేసింది. పాక్ కుయుక్తులపై కన్నేసి ఉంచిన భారత్.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. దీటైన జవాబిచ్చింది. అంతేకాదూ.. తెగబడితే తిరగబడతామని డ్రోన్ ఎటాక్లతో హెచ్చరించింది.
Published On - May 08,2025 10:01 PM