AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ – పాక్ కాల్పుల విరమణపై జమాతే ఇస్లామీ హింద్ కీలక ప్రకటన

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను జమాతే ఇస్లామీ హింద్ కీలక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమరణను స్వాగతించి అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ.. 'భారతదేశం -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను మేము స్వాగతిస్తున్నామని, ఇది సానుకూలమైన, ఎంతో అవసరమైన అభివృద్ధి అన్నారు ఇది రెండు ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఆశాకిరణాన్ని అందిస్తుందన్నారు.

భారత్ - పాక్ కాల్పుల విరమణపై జమాతే ఇస్లామీ హింద్ కీలక ప్రకటన
Jjamaat E Islami Hind
Balaraju Goud
|

Updated on: May 11, 2025 | 5:04 PM

Share

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను జమాతే ఇస్లామీ హింద్ కీలక ప్రకటన విడుదల చేసింది. కాల్పుల విరమరణను స్వాగతించి అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుస్సేనీ.. ‘భారతదేశం -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను మేము స్వాగతిస్తున్నామని, ఇది సానుకూలమైన, ఎంతో అవసరమైన అభివృద్ధి అన్నారు ఇది రెండు ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఆశాకిరణాన్ని అందిస్తుందన్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ కాలంలో శాంతి, ఉద్రిక్తతలను తగ్గించడం, సంయమనం కోసం వాదించడం కొనసాగించిన అన్ని వ్యక్తులు, పౌర సమాజ సమూహాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సాదతుల్లా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో, వారి స్వరాలు మానవ గౌరవాన్ని నిలబెట్టడం, జీవితాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయని తెలిపారు.

ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సయ్యద్ సాదతుల్లా తన సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరారు. పౌరులు, వివిధ సమాజాల జీవనోపాధి, ఆస్తి నష్టానికి పరిహారం చెల్లించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో నివసించే వారికి తగిన సాయం చేయాలని కోరారు. ఈ కాల్పుల విరమణ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందున, సంభాషణలు, దౌత్యాన్ని సంస్థాగతీకరించే ప్రయత్నాల ద్వారా మాత్రమే శాశ్వత శాంతిని నిర్ధారించగలమని సయ్యద్ సాదతుల్లా అన్నారు.

‘జమాతే ఇ ఇస్లామి హింద్ శాంతి, న్యాయం, సామరస్యానికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో శాశ్వత స్థిరత్వం, పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రారంభించడానికి,యు ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి చేయడానికి దృఢమైన చర్యలు తీసుకోవడానికి ఈ కాల్పుల విరమణను మరింత విస్తరించాలని రెండు దేశాలను కోరుతోంది’ అని ఆ ప్రకటన పేర్కొంది.

ఇటీవల, భారతదేశం-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత గురించి జమాతే-ఇ-ఇస్లామి హింద్ మాట్లాడుతూ, రెండు దేశాలు పేదరికం నిర్మూలించడానికి, ప్రజల శ్రేయస్సు, పురోగతి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. రెండూ అణ్వాయుధ శక్తులు తలపడితే యుద్ధం, అశాంతి ఎవరికీ ప్రయోజనం కలిగించవు. ఇది రెండు దేశాల పేద జనాభాకు అత్యంత హాని కలిగిస్తుంది. రెండు దేశాల రాజకీయ, సైనిక నాయకత్వం ఇప్పుడు శాశ్వత శాంతి వైపు వేగంగా, నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా