
ఇది సిందూర్ మాత్రమే కాదు.. సిన్-డోర్ కూడా. అంటే పాపాత్ములపై తెరుచుకున్న మృత్యుద్వారాలే ఈ సిన్-డోర్. పహల్గాంలో చనిపోయిన 26మంది ఆత్మలకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది. తలలో కాల్చారు.. గుండెల్లో కాల్చారు, మోకాళ్లపై కూర్చోబెట్టి కాల్చారు.
POK అండ్ పాకిస్తాన్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆ తొమ్మది కూడా ఉగ్ర క్యాంపులకు స్థావరాలుగా ఉన్నాయి. ఆ స్థావరాలు ఓసారి తెలుసుకుందాం.
ఈ తొమ్మది టార్గెట్స్ అన్నీ ముష్కర స్థావరాలే. ముష్కరుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఆపరేషనల్ స్కిల్స్ నేర్పిస్తున్న ఈ స్థావరాలు ఇప్పుడు ధ్వంసమయ్యాయి. దాదాపు వందమంది ముష్కరులను మట్టుబెట్టాయి మన సేనలు. ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తోంది. తమ బిడ్డలు చనిపోయారంటూ కన్నీరు పెడుతోంది. నిజమే ఉగ్రవాదులే మీ బిడ్డలు. మీది ఓ ఉగ్రదేశం అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి