Video: ఆపరేషన్ సిందూర్పై స్పందించిన రవి శంకర్! ఏమన్నారంటే..?
భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ పై శ్రీశ్రీ రవిశంకర్ స్పందించారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడి చేయడం సరైనదని, దేవుళ్ళు కూడా ఒక చేతిలో ఆయుధం, మరో చేతిలో పువ్వు పట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. భారత్ ఈ ప్రతి దాడి చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ, నేవీ ప్రతినిధులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ తెలిపారు. అయితే.. తాజాగా ఈ ఆపరేషన్ సిందూర్పై శ్రీశ్రీ రవిశంకర్ గురుజీ స్పందించారు. మాటలతో చెప్పినప్పుడు వినకుంటే చేతలో సమాధానం చెప్పాలని ఇప్పుడు భారత్ అదే చేసిందని అన్నారు. మన దేవుళ్లు కూడా ఒక చేతిలో ఆయుధం మరో చేతిలో పువ్వు పట్టుకొని ఉంటారని అన్నారు. సామాన్య ప్రజలకు హాని కలగకుండా భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

