షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

జ‌మ్మూక‌శ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లాలోని మోలు చిత్రగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు..

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 9:50 PM

జ‌మ్మూక‌శ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జిల్లాలోని మోలు చిత్రగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు గుర్తించిన సైన్యం.. వారి కోసం గాలింపు చేపడుతుంది. ఈ విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం