AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: కోణార్క్, పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న యాత్రికుల బస్సు బోల్తా.. నలుగురు మృతి!

ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 37 మంది భక్తులతో వెళ్తున్న యాత్రికుల బస్సు 20 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Odisha: కోణార్క్, పూరి జగన్నాథ్ నుంచి వస్తున్న యాత్రికుల బస్సు బోల్తా.. నలుగురు మృతి!
Bus Overturned In Odisha
Balaraju Goud
|

Updated on: Sep 28, 2024 | 5:12 PM

Share

ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 37 మంది భక్తులతో వెళ్తున్న యాత్రికుల బస్సు 20 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది భక్తులు గాయాలయయ్యాయి. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 37 మంది భక్తులతో వెళ్తున్న బస్సు ఒడిశాలోని బాలాసోర్‌లో బోల్తా పడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 37 మంది భక్తులు భువనేశ్వర్, కోణార్క్, పూరీ జగన్నాథ్ యాత్రకు వెళ్లారు. తిరిగి వస్తుండగా భక్తులతో నిండిన బస్సు ప్రమాదానికి గురైంది. ఒడిశాలోని బాలాసోర్‌లో జాతీయ రహదారిపై నుంచి బస్సు 20 అడుగుల లోతులో పడిపోయింది. గాయపడిన భక్తులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు యూపీలోని బలరాంపూర్‌కు చెందినవారు కాగా, మరో ఇద్దరు సిద్ధార్థనగర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

సమాచారం మేరకు బస్సు జాతీయ రహదారిపై నుంచి పడిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన భక్తులలో సిద్ధార్థనగర్ ఇటావాకు చెందిన రాంప్రసాద్, సంత్రం మరియు గౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రా గ్రామంలో నివసించే బల్రాంపూర్ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా ఉన్నారు. ఈ ప్రమాదంలో బలరాంపూర్ జిల్లా బెల్హాన్స్ గ్రామానికి చెందిన కమలా దేవి కూడా మరణించింది.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెద్ద సంఖ్యలో గాయపడిన భక్తులను వివిధ ఆసుపత్రులలో చేర్చారు. బాలాసోర్ జిల్లాలో 10 మంది ఆసుపత్రిలో చేరగా, జలేశ్వర్‌లోని ఆసుపత్రిలో 23 మంది చేరారు. భక్తులు జగన్నాథ పూరీ, ఇతర తీర్థ స్థలాలను సందర్శించడానికి ఉత్తరప్రదేశ్ నుండి బస్సులో బయలుదేరారు. కాని వారు తిరిగి వస్తుండగా, బస్సు హైవే నుండి 20 అడుగుల ఎత్తులో పడిపోవడంతో ప్రమాదానికి గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన భక్తులను స్థానికులు, పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న మృతుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో భక్తులు వెళ్తున్న బస్సు పూర్తిగా ధ్వంసమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..