AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మృతి మరో 40 మందికి గాయాలు…

ఒడిషాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాలోని తప్తపనిఘాటి సమీపంలో ఈ తెల్లవారుజామున బ్రిడ్జిపై నుంచి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది స్పాట్‌లోనే చనిపోయారు. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు తిక్రి నుంచి బెర్హంపూర్‌ వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు లోయలోపడ్డ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]

ఒడిషాలో ఘోర రోడ్డు  ప్రమాదం.. 9 మృతి మరో 40 మందికి గాయాలు...
Anil kumar poka
|

Updated on: Jan 29, 2020 | 12:36 PM

Share

ఒడిషాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాలోని తప్తపనిఘాటి సమీపంలో ఈ తెల్లవారుజామున బ్రిడ్జిపై నుంచి బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది స్పాట్‌లోనే చనిపోయారు. 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు తిక్రి నుంచి బెర్హంపూర్‌ వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

బస్సు లోయలోపడ్డ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని బెర్హంపూర్‌, దిగపహండి ఆస్పత్రులకు తరలించారు. అతివేగం, డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Follow Us