AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithyananda: ఆ పురాతన శైవ మఠానికి తదుపరి పీఠాదిపతి నేనే.. చర్చనీయాంశంగా మారిన నిత్యానంద ప్రకటన

అత్యంత పురాతనమైన శైవ పీఠాల్లో ఒక్కటైన మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద రాసిన బహిరంగ లేఖ తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీన మఠానికి తదుపరి పీఠాధిపతిని తానేనంటూ నిత్యానంద తనకు తానుగా ప్రకటించుకున్నారు.

Nithyananda: ఆ పురాతన శైవ మఠానికి తదుపరి పీఠాదిపతి నేనే.. చర్చనీయాంశంగా మారిన నిత్యానంద ప్రకటన
Madurai Aadeenam Arunagiri Nathan, Swamy Nithyananda
Janardhan Veluru
|

Updated on: Aug 13, 2021 | 11:07 AM

Share

Nithyananda: అత్యంత పురాతనమైన శైవ పీఠాల్లో ఒక్కటైన మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద రాసిన బహిరంగ లేఖ తమిళనాట చర్చనీయాంశంగా మారింది. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీన మఠానికి తదుపరి పీఠాధిపతిని తానేనంటూ నిత్యానంద తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఆ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ చేశారు. మధురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరి నాథన్ గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత అనారోగ్యంతో మదురైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులోని అత్యంత పురాతనమైన మఠాల్లో మధురై ఆధీనం కూడా ఒకటి. ఆ మఠానికి 292వ పీఠాధిపతిగా 1980 సంవత్సరం నుంచి అరుణగిరి నాథన్ సేవలందిస్తున్నారు. గతంలో మధురై అధీనం అరుణగిరి నాథన్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు భయపడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు.

మధురై ఆధీనంకు నిత్యానంద యువ పీఠాధిపతిగా 2012 ఏప్రిల్ 27న అరుణగిరి నాథన్ ప్రకటించారు. అప్పట్లో ఆ ప్రకటనపై తీవ్ర దుమారంరేగడంతో తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. సుందరమూర్తి స్వామిని యువ పీఠాధిపతిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి స్వామి నిత్యానంద కోర్టును ఆశ్రయించగా…ప్రస్తుతం విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

Madurai Aadeenam

Madurai Aadeenam

మధురై ఆధీనం పీఠాధిపతి అరుణగిరి నాథన్ పరిస్థితి మరింత విషమించిందన్న కథనాల నేపథ్యంలో తదుపరి అధీన పీఠాధిపతి ఎవరు అనే దానిపై శైవ పీఠాధిపతుల మధ్య చర్చ కొనసాగుతోంది. తాజాగా మధురై ఆధీనానికి తాను 293వ పీఠాధిపతినంటూ నిత్యానంద తనకు తాను ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మఠానికి సంబంధించిన సర్వ హక్కులు, అధికారాలు, ఆధ్యాత్మిక సంపద, మతపరమైన గౌరవాలు, పూజా కార్యక్రమాల నిర్వహణ అర్హతలు తనకే చెందుతాయని నిత్యానంద తన లేఖలో పేర్కొన్నారు.

Madurai Aadeenam Nithyananda2

Madurai Aadeenam, Nithyananda

స్వామి నిత్యానంద లేఖతో అప్రమత్తమైన శైవ మఠాదిపతులు.. మదురై అధీన మఠాన్నీ మూసివేసి తాళాలు వేశారు. స్వామి నిత్యానందను మదురై ఆధీనం పీఠాధిపతిగా అంగీకరించే ప్రసక్తే లేదని వారు చెబుతున్నారు. మదురై ఆధీనం పీఠంకు భారీ ఎత్తున స్థిరాస్తులు ఉన్నాయి. కొన్ని ఆస్తులను కౌలుకు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధురై ఆధీనం పీఠాధిపతిగా తదుపరి ఎవరురానున్నారన్న అంశం తమిళనాడు చర్చనీయాంశంగా మారింది.

Also Read..

శ్రావణ శోభను సంతరించుకున్న ఆలయాలు.. పుట్టలో పాలు పోస్తున్న భక్తులు…నాగ పంచమి విశిష్టత ఏమిటంటే

రాధికా ఆప్టేను బహిష్కరించాలంటోన్న నెటిజన్లు. ట్రెండింగ్‌లో బైకాట్‌ రాధికా.. కారణమేంటో తెలుసా?

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..