AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 India: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన మరణాలు..

Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న

Covid-19 India: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన మరణాలు..
Corona Cases In India
Shaik Madar Saheb
|

Updated on: Aug 13, 2021 | 9:50 AM

Share

Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో బుధవారం భారీగా పెరిగిన కరోనా కేసులు.. గురువారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా కొత్తగా 40,120 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 585 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్త కరోనా కేసుల సంఖ్య 3,21,17,826 కి చేరగా.. మరణాల సంఖ్య 4,30,254 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

తాజాగా ఈ మహమ్మారి నుంచి 42,295 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం 3,13,02,345 మంది కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,85,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 57,31,574 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాగా.. కరోనా ప్రారంభం నాటినుంచి ఆగస్టు 12 గురువారం వరకు దేశంలో ఇప్పటివరకు మొత్తం 48,94,70,779 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న 19,70,495 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

Also Read:

Honor killing: యువతిని దారుణంగా చంపిన కుటుంబసభ్యులు.. మరో వర్గానికి చెందిన యువకుడితో..

Mass Shooting: ఇంగ్లాండ్‌‌లో కాల్పుల మోత.. దుండగుడితో సహా ఆరుగురు మృతి..