AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మహిళల డ్రోన్‌ ప్రదర్శనలు వీక్షించిన ప్రధాని మోదీ..

దేశవ్యాప్తంగా 10 వేర్వేరు ప్రదేశాల నుంచి ‘నమో డ్రోన్ దీదీ’లు ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 1000 మంది నమో డ్రోన్‌ దీదీలకు డ్రోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శతాబ్ధంలో నారీ శక్తి భారతదేశ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలదని...

PM Modi: మహిళల డ్రోన్‌ ప్రదర్శనలు వీక్షించిన ప్రధాని మోదీ..
Pm Modi
Narender Vaitla
|

Updated on: Mar 11, 2024 | 4:43 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సుశక్త్‌ నారీ విక్షిత్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలోనే వ్యవసాయ డ్రోన్‌ ప్రదర్శలను వీక్షించారు.

దేశవ్యాప్తంగా 10 వేర్వేరు ప్రదేశాల నుంచి ‘నమో డ్రోన్ దీదీ’లు ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 1000 మంది నమో డ్రోన్‌ దీదీలకు డ్రోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శతాబ్ధంలో నారీ శక్తి భారతదేశ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలదని తాను నమ్ముతున్నానన్నారు. ప్రస్తుతం భారతీయ మహిళలు ఐటీ, అంతరిక్షం, సైన్స్‌ రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా వాణిజ్య పైలట్ల సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందనన్నారు.

నమో దీదీ డ్రోన్‌ కార్యక్రమం ద్వారా 15000 స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేసి, మహిళలను డ్రోన్‌ పైలట్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. ఈ డ్రోన్‌లు వ్యవసాయం అవసరాల కోసం, పంటల పర్యవేక్షణ, ఎరువులు జల్లడం, విత్తనాలు విత్తడం వంటి వాటితో మహిళలకు అతనపు ఆదాయ అవకాశాలు దక్కుతాయన్నారు. రానున్న రోజుల్లో దేశంలో డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం పెరగనుందని చెప్పుకొచ్చారు.

గత 10 ఏళ్లలో దేశంలో స్వయం సహాయక బృందాలు విస్తరించిన తీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న మోదీ.. భారతదేశంలోని స్వయం సహాయక సంఘాలు మహిళా సాధికారత రంగంలో కొత్త చరిత్ర సృష్టించాయని అన్నారు. తాను మహిళా సాధికారత గురించి మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ వంటి పార్టీలు తనను ఎగతాళి చేశాయన్న మోదీ, కానీ తమ ప్రభుత్వ పథకాలు అనుభవాల ఫలితమేనని ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ