AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Missing Rs 500 Notes: రూ. 88 వేల కోట్లు మాయం.. అన్నీ రూ.500 ల నోట్లే..! ఎవరు బాధ్యులు?

భారత కరెన్సీ నోట్లను మూడు ప్రభుత్వ ప్రెస్‌ల ద్వారా ముద్రిస్తారు. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్. ఈ మూడు ప్రెస్‌లు ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపుతాయి.

Missing Rs 500 Notes: రూ. 88 వేల కోట్లు మాయం.. అన్నీ రూ.500 ల నోట్లే..! ఎవరు బాధ్యులు?
Money
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2023 | 2:14 PM

Share

RTI సమాచారం ప్రకారం..ముద్రించిన 500 రూపాయల నోట్లకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు చేరిన నోట్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో లెక్కలోకి రాని ఈ కరెన్సీ నోట్ల విలువ 88,032.5 కోట్ల రూపాయలు కావడం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. మూడు భారతీయ మింట్‌లు కొత్తగా ముద్రించిన 500 రూపాయల 8,810.65 మిలియన్ నోట్లను విడుదల చేశాయని, అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 7260 మిలియన్ నోట్లను మాత్రమే పొందిందని ఒక నివేదిక పేర్కొంది. మిగిలిన నోట్ల సంఖ్య కూడా కనిపించకుండా పోయిందని తెలిపింది. దీనిపై రిజర్వ్‌ బ్యాంకుకు ప్రశ్నలు సంధించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు.

భారత కరెన్సీ నోట్లను మూడు ప్రభుత్వ ప్రెస్‌ల ద్వారా ముద్రిస్తారు. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్. ఈ మూడు ప్రెస్‌లు ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపుతాయి. దేశంలో ద్రవ్య ప్రవాహాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది.

మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా ప్రచురించారు. 500 నోట్ల స్థితిగతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆయన ప్రశ్నించారు. 2015-16లో, నాసిక్ ప్రెస్ కొత్తగా రూపొందించిన రూ.500 నోటులో 375.450 మిలియన్ నోట్లను ముద్రించిందని నివేదిక పేర్కొంది. కానీ మరో RTI ప్రత్యుత్తరంలో, నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్ ఏప్రిల్ 2015, డిసెంబర్ 2016 మధ్య RBI రికార్డులు కేవలం 345 మిలియన్ నోట్లను మాత్రమే స్వీకరించినట్లు చూపుతున్నాయి. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2015-మార్చి 2016) రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉన్నప్పుడు రూ. 210,000 మిలియన్లు, రూ. 500 నోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (బి) లిమిటెడ్, బెంగళూరు ఆర్‌బిఐకి 5,195.65 మిలియన్ 500 రూపాయల నోట్లను జారీ చేసింది. 2016-2017లో ఆర్‌బిఐకి 1,953.000 మిలియన్ నోట్లను బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ జారీ చేసింది. కానీ ఆర్బీఐకి 7,260 మిలియన్ నోట్లు మాత్రమే వచ్చాయి. ఇవన్నీ మూడు ప్రెస్‌ల నుంచి కొత్తగా రూపొందించిన 500 రూపాయల నోట్లు.

అందువల్ల మొత్తం మూడు ప్రెస్‌లలో ముద్రించిన 8810.65 మిలియన్‌ రూపాయల నోట్లలో 7260 మిలియన్‌ నోట్లు మాత్రమే ఆర్‌బిఐకి అందాయని ఆ ప్రకటన తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో నోట్లు మాయమవడం దేశ భద్రతకు ముప్పు అని మనోరంజన్ రాయ్ అన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరుతూ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు లేఖ రాశారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..