మహిళకు జిమ్‌ ట్రైనర్‌ వేధింపులు.. మాట వినకపోతే కూతురిని కిడ్నాప్‌ చేస్తానంటూ బెదిరింపులు.. చివరకు..

|

Nov 14, 2022 | 7:25 PM

నిందితులు చాలాసార్లు కాల్‌ చేశారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి తానే వారి కాల్‌కు ఆన్సర్‌ ఇవ్వగా నిందితుడు తనను కలవమని అడిగాడు. అయితే, అందుకు నిరాకరించిన మహిళ..

మహిళకు జిమ్‌ ట్రైనర్‌ వేధింపులు.. మాట వినకపోతే కూతురిని కిడ్నాప్‌ చేస్తానంటూ బెదిరింపులు.. చివరకు..
Harassment
Follow us on

ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ముంబైలోని కొలాబాలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం.. 29 ఏళ్ల జిమ్‌ శిక్షకుడిపై ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో వేధింపులు, బెదిరింపు ఆరోపణలపై పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదు చేసిన మహిళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే, జిమ్‌ట్రైనర్‌ వైభవ్‌ కస్బేకర్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నట్టుగా ఆరోపిస్తూ.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వైభవ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బాధిత మహిళ తన కుటుంబంతో కలబాలో ఉంటున్నారు. స్థానికంగా వడా-పావ్‌ స్టాల్‌ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు వైభవ్‌ కస్బేకర్‌ మొదటిసారి జూన్‌ 2021లో తమ స్టాల్‌ను సందర్శిచినట్టుగా పోలీసులకు చెప్పింది. ఆర్డర్లు ఇవ్వడానికి అతను తన మొబైల్‌ నంబర్‌ను అడిగాడని ఆమె పేర్కొంది. అయితే, తాను తన భర్త నెంబర్‌ ఇచ్చానని చెప్పింది. నిందితులు చాలాసార్లు కాల్‌ చేశారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఒకసారి తానే వారి కాల్‌కు ఆన్సర్‌ ఇవ్వగా నిందితుడు తనను కలవమని అడిగాడు. అయితే, అందుకు నిరాకరించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్టుగా చెప్పింది.

అయితే, ఈ క్రమంలోనే నవంబర్‌ 12శనివారం రోజున నిందితుడు సరారీ తమ ఇంటికే వచ్చాడని చెప్పింది. తనను ఎలాగైనా కలవాలని, తన మాట వినకపోతే, తన కుమార్తెను కిడ్నాప్‌ చేస్తానని బెదిరించినట్టుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రైం న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి