బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. టీబీఎం కట్టర్ హెడ్ అమరిక సక్సెస్.. మిక్స్ షీల్డ్ టెక్నాలజీతో..
దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముంబైలోని 21 కిలోమీటర్ల పొడవైన సముద్ర సొరంగ నిర్మాణంలో రెండో భారీ టీబీఎం కట్టర్ హెడ్ అమరిక విజయవంతంగా పూర్తయింది. దేశంలోనే అతిపెద్ద 13.6 మీటర్ల వ్యాసం గల టన్నెల్లో అప్, డౌన్ లైన్లు నిర్మించనున్నారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ముంబయి, అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ నిర్మాణంలో వేగం మరింత పెరిగింది. ముంబైలో ఇప్పటికే ఒకవైపు టన్నెల్ పూర్తవ్వగా.. తాజాగా రెండోవైపు టీబీఎం కట్టర్ హెడ్ అమరిక విజయవంతంగా పూర్తయింది. సావ్లీ షాఫ్ట్లో 350 టన్నుల భారీ కట్టర్ హెడ్ ఏర్పాటు పూర్తి చేశారు. 21 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం కోసం భారీ యంత్రాలు రంగంలోకి దిగాయి. 13.6 మీటర్ల వ్యాసంతో దేశంలోనే అతిపెద్ద సొరంగం నిర్మించబోతున్నారు. ఒకే టన్నెల్లో అప్ అండ్ డౌన్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. జులై మొదటి వారంలో సొరంగ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. రెండవ టీబీఎం ప్రయాణం విక్రోలి వైపు సాగనుంది. దీంతో రెండు వైపుల నుంచి వేగవంతంగా పనులు జరగనున్నాయి. మిక్స్ షీల్డ్ టెక్నాలజీతో అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చారు. సురక్షితమైన సొరంగ నిర్మాణమే లక్ష్యమన్నారు హైస్పీడ్ రైల్ కారిడార్ అధికారులు. నిమిషానికి 49 మిల్లీ మీటర్ల వేగంతో TBM తవ్వకం జరపనుంది. రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యావరణానికి నష్టం కలగకుండా సముద్ర మట్టం కంటే లోతులో సొరంగ మార్గ నిర్మాణం ఉంటుంది.
ముంబయి, అహ్మదాబాద్లను అనుసంధానించేలా చేపట్టిన 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 పర్వత సొరంగాలు ఉండగా, వాటిలో 7 మహారాష్ట్రలోనే ఉన్నాయి. దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి.
బుల్లెట్ రైలు కోసం వందల కిలోమీటర్ల ట్రాక్ పూర్తవుతుండగా.. ఈ రైలు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్ఫాటా మధ్య ఒక పొడవైన సొరంగం నుంచి వెళ్తుంది. 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్లో ఇప్పటికే ఒక భాగం నిర్మాణం పూర్తయింది. రెండో భాగం పనులు జులై నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
